Connect with us

Politics

NRI TDP Kuwait, Janasena: జైలు గోడల నుంచి జనం గుండెల్లోకి కార్యక్రమం విజయవంతం

Published

on

NRI TDP Kuwait, Janasena పార్టీ లు సంయుక్తంగా జైల్ గోడల నుంచి జనం గుండెల్లోకి అను కార్యక్రమము తెలుగుదేశం అభిమానుల సహకారం తో నిర్వహించడం జరిగింది. అక్రమ నిర్బంధం నుంచి ఆరోగ్య కారణాల రీత్యా మంజూరు అయిన మధ్యంతర బెయిల్ లో విడుదల అయిన గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నారు.

అలాగే వైసీపీ ప్రభుత్వం పెట్టిన,పెడుతున్న అక్రమ కేసులలో కడిగిన ముత్యంలా మా నాయకుడు వస్తాడని తెలుగుదేశం అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ జైల్ గోడల నుంచి జనం గుండెల్లోకి అను కార్యక్రమము శుక్రవారం నిర్వహించారు. పెద్ద ఎత్తున తెలుగుదేశం అభిమానులు ఈ కార్యక్రమము లో పాల్గొన్నారు.

NRI TDP Gulf Council సభ్యులు శ్రీ వెంకట్ కోడూరి గారు, ప్రధాన కార్యదర్శి మల్లి మారోతు గారు, కోశాధికారి మోహన్ రాచూరి గారు, అస్మా, హవాల్లి గవర్నరేట్ కో ఆర్డినేటర్ లు ముస్తాక్ ఖాన్, కోలపనేని రమేష్, రెడ్డయ్య చౌదరి, జనసేన నాయకులు, హరి రాయల్, అలీ, పులివెందులు తాలుకా చక్రాయపేట మండల, వరికుంటపల్లె తిరుమలకొండ వెంకటబుజ్జి, రాజు తిరుపతి సుగుణమ్మ, మోహన్ దేరంగుల, సిద్దయ్య, రమేష్, చినకొండప్ప, బీసీ సంఘం అధ్యక్షులు శంకర్ యాదవ్ గారు, సీనియర్ నాయకులు గుండయ్య నాయుడు గారు, మహిళా నాయకురాలు నారాయణమ్మ, అంజలి, నిర్మలమ్మ, రవి మలిసెట్టీ గార్లు, శ్రీను, మహేష్ సుబ్బరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected