Connect with us

Sports

UK NRI TDP: పూతలపట్టులో సామజిక కార్యక్రమాలు, క్రికెట్ టోర్నమెంట్

Published

on

తెలుగు దేశం పార్టీ కి చెందిన NRI లు గత 4 యేండ్లగా పూతలపట్టు నియోజక వర్గంలో వివిధ సామజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. యువగళం పాదయాత్ర లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. అక్కడ యూకే టిడిపి ఎన్నారైలు అయినటువంటి ఊట్ల శ్యాంసుందర్రావు మరియు దగ్గుపాటి బాలకృష్ణ గారి అద్వర్యంలో నియోజక వర్గ స్థాయిలో క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశారు.

పెద్ద ఎత్తున యువత ని ఆకర్షించి వాళ్ళకి భవిషత్తు 6 గ్యారంటీలు మరియు నియోజకవర్గం లో చెయ్యాలిసిన భవిషత్తు కార్యక్రమాలు యువత తో పంచుకున్నారు. దాదాపు ఈ సంవత్సర టోర్నమెంట్ లో 20 కి పైగా క్రికెట్ టీమ్స్ (Cricket Teams) ఈ కార్యకరం లో పాల్గొన్నాయి.

ముందుగా ఈ కార్యక్రమానికి కి ముఖ్య అతిథులు గ తెలుగుదేశం పార్టీ పూతలపట్టు నియోజకవర్గం ఇంచార్జి డాక్టర్ కలిగిరి మురళీమోహన్, పూతలపట్టు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దొరబాబు చౌదరి గారు, చిత్తూర్ తెలుగు యువత ఉపాధ్యక్షుడు బద్దిలి హేమాద్రి నాయుడు, టి.ఎన్.టి.యు.సి. రాష్ట్ర కార్యదర్శి యువరాజులు నాయుడు గారు పాల్గొన్నారు.

ఇంచార్జి మురళీమోహన్ మాట్లాడుతూ.. పూతలపట్టు లో NRI టీడీపీ యూరోప్ వాళ్ళు గత నాలుగు సంవత్సరాలు గ వివిధ కార్యక్రమాలని చేపట్టారు. సమాజం పట్ల వాళ్ళకి వున్నా బాధ్యత చూస్తుంటే చాల సంతోషం గ వుంది. రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ సహకారం తప్పకుండ తీసుకుంటాను అలానే నిజాయకవర్గ స్థాయి లో జరగబోయే కార్యక్రమాలలో కూడా వాళ్ళని కలుపుకుని ముందుకు తీసుకుని వెళతాను అని చెప్పారు.

NRI యూరోప్ నుంచి శ్యాం ఉట్ల, బాలకృష్ణ దగ్గుపాటి గారితో పాటు వాళ్ళ కోర్ టీం సభ్యులు అయినాDr కిషోర్ బాబు, వివేక్ కరియువుల, అమర్నాద్ పొట్లూరి, కృష్ణ ప్రసాద్ కాట్రగడ్డ, విజయ్ అడుసుమిల్లి, కృష్ణ వల్లూరి, శ్రీనివాస్ గోగినేని, ప్రవీణ్ ఉన్నం, సుమంత్ పడాల, శివ కృష్ణ, రామకృష్ణ, సతీష్ ముళ్ళపూడి, సాయి వెంకట మౌర్య గార్లు అందరితో కలిసి భవిషత్తు కార్యక్రమాలలో కలిసి ముందుకి వెళ్తాను అని తెలియచేసారు.

ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం గా అవ్వటం లో ముఖ్యంగా నిర్వాహుకులు దగ్గుపాటి మోహన్ గారు, దగ్గుపాటి లోకేష్ గారు, బద్దిలి పృథ్వి గారు, మామిడిపల్లి సాయి మోహన్ గారు లకి NRI (Non Resident Indians) లు అందరు కృతజ్ఞతలు తెలియచేసారు.

ఈ కార్యక్రమానికిసహాయ సహకారాలు అందించిన పెద్దలు ఊట్ల నాగరాజు నాయుడు గారు(మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్) ,సీనియర్ నాయకులు దగ్గుపాటి లక్ష్మీనారాయణ గారు, బొమ్మన శ్రీధర్ గారు, మాజీ డిసిసిబి చైర్మన్ కాంతారావు గారు, మాజీ మండల అధ్యక్షులు చంద్రమౌళి గారు, బైటపల్లి పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షులు పెద్దినేని మోహన్ గారు, కే.సుబ్బరాజులు గారు తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుల పూతలపట్టు మండలం, కే నాగరాజు గారు (Ex-MPTC) అందరికి కృతజ్ఞతలు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected