Connect with us

Education

వెంకట్ కోగంటి దాతృత్వం, పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్

Published

on

తానా ఫౌండేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రాజెక్ట్ ‘చేయూత’. ఈ ప్రాజెక్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్థులను ఎంపిక చేసి స్కాలర్షిప్స్ అందజేస్తున్నారు. డిసెంబర్ 29వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించిన తానా చేయూత కార్యక్రమానికి కాలిఫోర్నియా వాసి వెంకట్ కోగంటి స్పాన్సర్ చేసారు.

చేయూత ప్రాజెక్ట్ ద్వారా పేద విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్స్ అందించారు. తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ చేతుల మీదుగా చెక్స్ పంపిణి జరిగింది. ఈ కార్యక్రమం ఫౌండేషన్ సెక్రటరీ మరియు చేయూత ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శశికాంత్ వల్లేపల్లి నిర్వహణలో ఘనంగా నిర్వహించారు. తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ జనార్దన్ నిమ్మలపూడి, క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected