Connect with us

Government

న్యూయార్క్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఘన స్వాగతం, UNO లో ప్రసంగం

Published

on

భార‌త కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమెరికా విచ్చేశారు. న్యూయార్క్‌లోని JFK ఎయిర్‌పోర్టులో కిషన్ రెడ్డికి ఎన్నారైలు ఘన స్వాగతం ప‌లికారు. ప్రవాస భారతీయులు కృష్ణా రెడ్డి ఏనుగుల (మాజీ అఫ్-బీజేపీ-జాతీయ అధ్యక్షలు), రఘువీర్ రెడ్డి, రామ్ వేముల, విలాస్ రెడ్డి జంబుల (తెలంగాణ అఫ్-బీజేపీ కన్వీనర్), వంశీ యంజాల, కృష్ణ మోహన్ ములే, హరి సేతు, దీప్ భట్ తదితర కమ్యూనిటీ లీడర్లు కిష‌న్ రెడ్డికి స్వాగ‌తం ప‌లికిన వారిలో ఉన్నారు.

మన దేశం జీ-20 సమావేశాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో కేంద్ర పర్యాటక మంత్రిగా, ‘జీ-20 దేశాల టూరిజం చైర్‌‌’ (ఐక్యరాజ్య సమితి హైలెవల్ పొలిటికల్ ఫోరం) వేదికగా భారత పర్యాటక మంత్రి హోదాలో కిషన్ రెడ్డి గారు ఈ అంతర్జాతీయ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజాప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొంటారు. ఈ అరుదైన‌ అవకాశం దక్కించుకున్న తొలి భారత పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ఇటీవల గోవాలో జీ-20 దేశాల పర్యాటక మంత్రులు, 9 ప్రత్యేక ఆహ్వానిత దేశాల మంత్రుల సమావేశాల్లో భార‌త్‌ చేసిన ప్రతిపాదనలను సభ్యదేశాలు, ఆతిథ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected