Connect with us

Health

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కమలేష్ పటేల్ ‘దాజి’ ఆధ్వర్యంలో యోగా, ధ్యాన సదస్సు: తానా

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఆధ్వర్యంలో యోగా, ధ్యాన సదస్సు నిర్వహించనున్నారు. మార్చి 13 నుండి ఏప్రిల్ 3 వరకు 5 వారాంతాలపాటు హార్ట్ఫుల్ మెడిటేషన్ అనే కార్యక్రమంలో భాగంగా ఈ యోగా, ధ్యాన సెషన్స్ నిర్వహించనున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కమలేష్ పటేల్ ‘దాజి’ ఆన్లైన్లో శిక్షణ ఇవ్వనున్నారు.

కోవిడ్ టైంలో బాగా ఉపయోగపడే ఈ శిక్షణా శిబిరాన్ని అంజయ్య చౌదరి లావు అధ్యక్షతన, తానా కార్యవర్గ సభ్యులు రాజా కసుకుర్తి, వెంకట్ మీసాల, భరత్ మద్దినేని, హితేష్ వడ్లమూడి, వినయ్ మద్దినేని, కిరణ్ గోగినేని, శ్రీరామ్ రొయ్యల, శశిధర్ జాస్తి, మరియు కృష్ణ లింగా సమన్వయపరుస్తున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected