Connect with us

Service Activities

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అతిథిగా వీరవల్లిలో రాజా కసుకుర్తి సేవా కార్యక్రమాలు: Telugu Association of North America

Published

on

కృష్ణా జిల్లా, బాపులపాడు మండలం, వీరవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తానా కమ్యూనిటి సర్వీసెస్ కోఆర్డినేటర్ కసుకుర్తి రాజా సుమారు 8 లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించిన సైకిల్ షెడ్డుని తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మరియు పలువురు ప్రముఖులతో కలిసి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు స్కాలర్షిప్లు, రైతులకు స్పేయర్లు, కిట్లు, దుప్పట్లు అందజేశారు.

అనంతరం ప్రధానోపాధ్యాయరాలు నిర్మల అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని అమెరికాలో ఉంటూ సొంత ఊరిని, చదుకున్న పాఠశాలను మరిచిపోకుండా సైకిల్ షెడ్ నిర్మించిన కసుకుర్తి రాజాకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తెలిపారు.

సాయం చేసే గుణం అందరికి ఉండదని అలాంటిది స్వంత గ్రామాభివృద్ది, పాఠశాల అభివృద్ధికి తన తోడ్పాటుని అందిస్తున్న తానా కమ్యూనిటి సర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి సేవలు మన అందిరికి స్ఫూర్తిదాయకమని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అన్నారు.

విదేశాల్లో స్ధిరపడినప్పటికీ జన్మభూమి పట్ల మమకారంతో ఆంధ్రా తెలంగాణా రాష్ట్రాలలో తానా ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులు చేస్తున్న సేవలు అనిర్వచనీయమైనవి కొనియాడారు. విద్యా వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయని కులం, మతం తేడా లేకుండా ఏ స్థాయిలో ఉన్న వారినైనా సమానంగా నిలబెట్టేది ఒక్క విద్య మాత్రమే అన్నారు.

పుట్టి పెరిగిన ఊరు, చదివిన పాఠశాల మరచిపోకూడదు అనే ఉద్దేశ్యంతో పాఠశాల్లో సైకిల్ షెడ్ నిర్మాణం చేయడం జరిగిందని రాజా కసుకుర్తి తెలిపారు. షెడ్ ను ఎమ్మెల్యే వంశీ చేతులు మీదగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రైతు కుటుంబం నుండి వచ్చి ఉన్నత చదువులు చదివి ఎంత ఎదిగినా రైతులను మరువకూడదు అనే ఉద్దేశ్యంతో పవర్ స్ప్రేయర్లు, మందుల పిచికారీలో ఉపయోగించే రక్షణ కిట్లు ఇస్తున్నామన్నారు.

ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కాలర్ షిప్ లు తానా ఆధ్వర్యంలో అందిస్తున్నామని రాజా అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదవుకుంటున్నామని విద్యార్థులు చిన్నచూపుగా భావించవద్దని నేను, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఇక్కడ ఉన్నవారంతా ప్రభుత్వ బడుల్లో చదువుకుని మంచి స్ధాయిలో స్ధిరపడ్డామని, మీరు బాగా చదవి ఉన్నత స్ధాయిలో స్ధిరపడాలన్నారు.

కసుకుర్తి రాజా శ్రీమంతుడులా పుట్టిన ఊరు, చదువుకున్న పాఠశాల రుణం తీర్చుకునేందుకు ఇలాంటి వ్యక్తి మీ గ్రామంలో ఉండటం గ్రామానికే గర్వకారణమని అంజయ్య చౌదరి లావు అన్నారు. తానా నాలుగున్నర దశాబ్దాలుగా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి జన్మభూమిలో మెగా క్యాన్సర్ క్యాంపు, వైద్య శిబిరం, కంటి వైద్య శిబిరం, రైతు కోసం అనాధ పిల్లలకు దుస్తులు, పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లు క్లిన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు.

విదేశాల్లో తెలుగువారు ఎదైనా రోడ్డు ప్రమాదం, అనారోగ్య సమస్యలతో, హత్యకు గురైనా మృతదేహాలు స్వస్ధలాలకు పంపించటమేకాక వారికి ఆర్ధిక సాయం చేస్తోందన్నారు. ఎదైనా సమాచారం వస్తే తక్షణంమే స్పందించి తానా సభ్యులు 24 / 7 పనిచేస్తున్నారన్నారు. ఎన్నో వేలాది మంది సభ్యులు గల తానా సేవలు ముందుకు దూసుకుపోతుందన్నారు. అంతరించిపోతున్న సంస్కృతి సంప్రదాయాల మరల మన వారికి పరిచయం చేసేందుకు తానా చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో సాంస్కృతి కళోత్సవాలు దోహదపడతాయని అంజయ్య చౌదరి అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ నగేష్, జడ్పిటిసి గంగాభవానీ, నక్కా గాంధీ, అవిర్నేనే శేషగిరి, చిలకపాటి పద్మనాభం, హెచ్ ఎం నిర్మల, సర్పంచ్ పిల్లా అనిత, గూడవల్లి రత్న సుధాకర్, కలపాల రాజబాబు, అత్మూరి బాలాజీ, కోడేబోయిన బాబీ, పిఏసిఎస్ ఛైర్ పర్సన్ అల్లాడి ధెరిస్సా, పాఠశాల అభివృద్ది ఛైర్మన్ మద్ది రామమ్మ, వైస్ ఛైర్మన్ చందు రాజా పాల్గొన్నారు.

అలాగే ఎంపీపీ చందురమాదేవి, ఎంపిటిసీలు దూసరి నిర్మల, అమృతపల్లి సూర్యానారాయణ , పూర్వ విద్యార్ధి లింగమనేని రాజారావు, ఎంపిడో ప్రభాకారావు, ఏఈ జయరాజు, ఈవో శ్యామలరావు, పిల్లా రామారావు, ఉపసర్పంచ్ లంక అజేయ్ రాయి, శివపార్వతి తోమండ్రు రమేష్ మోర్ల, అంజనేయలు, గండి చిన్నారావు, పాఠశాల ఉపాధ్యాయలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొని రాజా ని అభినందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected