Connect with us

Felicitation

రతనాల సీమలో ఘనంగా పురుషోత్తమ చౌదరి గుదే అభినందన సభ: అనంతపురం, రాయలసీమ

Published

on

పురుషోత్తమ చౌదరి గుదే ప్రముఖ ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫాండేషన్ ట్రస్టీ గా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఎన్నిక అనంతరం పురుషోత్తమ చౌదరి మొదటిసారిగా అనంతపురం విచ్చేసిన సందర్భముగా పలువురు అభినందించారు. స్థానిక మసినేని గ్రాండ్ హోటల్లో జరిగిన ఈ ఆత్మీయ అభినందన సభను తెలుగు యువత జిల్లా మాజీ అధ్యక్షులు సి. వీ. కొండయ్య ఏర్పాటుచేసారు.

ఈ ఆత్మీయ అభినందన సభలో జిల్లా తెలుగుదేశం సీనియర్ నాయకులు సరిపూటి సూర్య నారాయణ, జిల్లా కమ్మ సంఘం అధ్యక్షులు నాగన్న, మాజీ రిజిస్టార్ సుధాకర్ బాబు, జిల్లా తెలుగు దేశం సాంస్కృతిక విభాగం అధ్యక్షులు వీరాంజనేయులు మరియు అనంతపురం జిల్లా నుంచి వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. అందరూ పురుషోత్తమ చౌదరి చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను కొనియాడారు.

పురుషోత్తమ చౌదరి మాట్లాడుతూ తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు నాయకత్వంలో సేవా కార్యక్రమాలను అనంతపురం జిల్లాలో మరింత ముందుకు తీసుకువెళతాము అని హామీ ఇచ్చారు. పురుషోత్తమ చౌదరి తానా ట్రస్టీగా ఎన్నికైన సందర్భాన్ని పునస్కరించుకొని ధర్మవరం మాజీ శాసన సభ్యులు, రాష్ట్ర బీజేపీ నాయకులు గోనుగుంట్ల సూర్యనారాయణ పట్టు వస్త్రాలు బహూకరించి ఘనంగా సత్కరించడం విశేషం.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected