Connect with us

Politics

నారా లోకేష్ యువగళానికి సంఘీభావంగా కువైట్ లో పాదయాత్ర

Published

on

జనగళాన్ని యువగళంగా మార్చుకొంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తలపెట్టిన ‘యువగళం’ పాదయాత్ర శుక్రవారం ఉదయం 11.03 గంటలకు ప్రారంభమైంది. ఈ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ యన్.ఆర్.ఐ. టిడిపి కువైట్ అధ్వర్యంలో, తెలుగు మహిళలు, అభినందనలు తో యాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని అటు ముస్లిం సోదరులు తో కలసి ప్రార్ధన నిర్వహించారు.

లోకేశ్ జన్మదిన కేకు ను కూడా కట్ చేసి యాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం కుటుంబ ఆత్మీయ స్వాగ‌తానికి ధ‌న్య‌వాదాలు. మీ ఆశీస్సుల‌తో యువగళం సంఘీభావ పాద‌యాత్రకు త‌ర‌లివ‌చ్చిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు, నందమూరి మరియు నారా అభిమానులంద‌రికీ పేరు పేరునా యన్.ఆర్.ఐ. టిడిపి కువైట్ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected