Connect with us

Devotional

తిరుమలలో నారా లోకేష్ కు శుభసూచకంగా శ్రీవారి చిత్రపటాన్ని బహుకరించిన సతీష్ వేమన

Published

on

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని దివ్య ఆశీస్సులు దండిగా ఉండాలని, మహా దైవం బాలాజీ భవ్యమైన ఆశీస్సులతో లోకేష్ తలపెట్టిన పాదయాత్ర ప్రగతి పథంలో పయనించాలని తానా మాజీ అధ్యక్షులు, ఎన్ఆర్ఐ ప్రముఖులు సతీష్ వేమన ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఆయన తిరుమలలో పెరుమాళ్ళు దర్శనానికి విచ్చేసిన నారా లోకేష్ ను కలిసి శ్రీవారి చిత్రపటాన్ని బహుకరించారు. లోకేష్ యువగళం ఉత్తుంగ తరంగంలా, ఆంధ్రప్రదేశ్లో ప్రభంజనాన్ని సృష్టించాలని సతీష్ వేమన శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

నారా లోకేష్ కలియుగ వైకుంఠనాధుని దివ్య ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ… తనకు ఎల్లవేళలా వెన్నుదన్నుగా నిలుస్తున్న ఎన్ఆర్ఐ సోదరులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected