Connect with us

Politics

బీజేపీ వ్యతిరేకంగా ఫ్రంట్ ఆలోచనలు

Published

on

ప్రస్తుత పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ‌ అధినేత మమతా బెనర్జీ జాతీయ రాజకీయాల దిశగా ఆలోచన చేస్తున్నారు. బీజేపీని ధీటుగా ఎదుర్కొని మట్టికరిపించేందుకు ఉమ్మడిగా ఉద్యమిద్దామని తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్‌, జగన్‌ తో కలిపి పది విపక్షాల నేతలకు ఈరోజు ఓ లేఖ వ్రాసారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలపై చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైనది అంటూ తనతో కలిసి రావాలని కోరారు. మమతా బెనర్జీ లేఖ అందుకున్న నేతల్లో సోనియాగాంధీ, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, కే చంద్రశేఖర్‌రావు, శరద్‌ పవార్‌, స్టాలిన్‌, ఉధ్దవ్‌ ఠాక్రే, అఖిలేష్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, దీపాంకర్‌ భట్టాచార్య ఉన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected