భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్, అసోం మరియు పుదుచ్చేరి రాష్ట్రాల్లో సాధించిన చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకొని, ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ-యూఎస్ఏ (OFBJP USA) ఆధ్వర్యంలో న్యూజెర్సీ (New Jersey) రాష్ట్రంలోని ఎడిసన్ (Edison) నగరంలో ఉన్న రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో ఘన విజయోత్సవ సభ నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ట్రై-స్టేట్ ప్రాంతం నుండి 600 మందికి పైగా భారతీయ అమెరికన్లు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ (West Bengal) లో బీజేపీ తొలిసారి సాధించిన చారిత్రాత్మక విజయంతో పాటు, అసోంలో వరుసగా మూడోసారి మరియు పుదుచ్చేరిలో రెండోసారి NDA ప్రభుత్వం ఏర్పడటం పట్ల సభలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
ప్రతి ఫలితాన్ని సభికులు ఘన చప్పట్లతో స్వాగతించారు. భారత (India) పార్లమెంట్ సభ్యులు శ్రీ మయాంక్ నాయక్ గారు జూమ్ ద్వారా సభను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ (Narendra Modi) గారు, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా (Amit Shah) గారి నాయకత్వంలో బీజేపీ ఎన్నో సంవత్సరాల పాటు కృషి చేసి ఈ విజయాన్ని సాధించిందని ఆయన పేర్కొన్నారు.
శ్రీ అమర్ గోస్వామి గారు ఆయనను సభకు పరిచయం చేశారు. ఆఫ్ బీజేపీ-యూఎస్ఏ అధ్యక్షులు డా. అడపా ప్రసాద్ (Dr. Prasad Adapa) గారు మాట్లాడుతూ, “భారత భద్రత మరియు సమగ్రత దృష్ట్యా బెంగాల్ మరియు అసోం (Assam) విజయాలు ఎంతో కీలకం” అని అన్నారు. భారతీయ జనసంఘ స్థాపకుడు డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి 75వ వార్షికోత్సవ సంవత్సరంలో బెంగాల్లో బీజేపీ విజయం సాధించడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు.
అలాగే కేరళ (Kerala) లో కూడా బీజేపీ ఓట్ల శాతం మరియు స్థానాల్లో మంచి పురోగతి సాధించిందని, వచ్చే ఎన్నికల్లో అక్కడ కూడా బీజేపీ (BJP) అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆఫ్ బీజేపీ-యూఎస్ఏ ప్రధాన కార్యదర్శి శ్రీ వాసుదేవ్ పటేల్ (Vasu Patel) గారు మాట్లాడుతూ, “ఇది ఎంతో మధురమైన విజయం.
అనేక సంవత్సరాలుగా బీజేపీ కార్యకర్తలు నేలస్థాయిలో చేసిన కఠోర శ్రమకు భారత ప్రజలు ఇచ్చిన గౌరవం ఇది” అని అన్నారు. ఆఫ్ బీజేపీ-యూఎస్ఏ పూర్వ అధ్యక్షులు క్రిష్ణారెడ్డి అనుగుల (Krishna Reddy Anugula) మాట్లాడుతూ అమెరికా లో వర్కింగ్ డే అయినప్పటికీ సుమారు 600 మందికి పైగా భారతీయ అమెరికన్లు హాజరయ్యారు అంటే చారిత్రాత్మక విజయం మీద ప్రజలు చాలా సంతోషాన్ని ఈ విధముగా తెలిపారు.
ఆఫ్ బీజేపీ-యూఎస్ఏ తెలంగాణ చాప్టర్ కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల (Vilas Reddy Jambula) మాట్లాడుతూ తెలంగాణ (Telangana) లో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలని, డబల్ ఇంజిన్ సర్కారు రావాలని కోరుతూ, దీని కోసం మోడీ గారి సభ హైదరాబాద్ (Hyderabad) లో విజయవంతముగా జరగడాన్ని అభినందిస్తూ, తెలంగాణ చాప్టర్ కమిటీ వాలంటీర్ లు కృషి చేస్తున్నారు అని తెలిపారు.
సభలో పలువురు వక్తలు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా గారు మరియు బీజేపీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నితిన్ నబీన్ (Nitin Nabin) గారి నాయకత్వాన్ని ప్రశంసించారు. పార్టీ బలోపేతానికి వారి వ్యూహాత్మక నాయకత్వం మరియు క్షేత్రస్థాయి నిర్వహణ ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ కమ్యూనిటీ నాయకులు (Community Leaders) మరియు సేవకులు శ్రీ కృష్ణారెడ్డి అనుగుల, శ్రీ జయేష్ పటేల్, శ్రీ చరణ్ సింగ్, శ్రీ ఆల్బర్ట్ జసాని, శ్రీ హెచ్.ఆర్. షా, డా. సుధీర్ పారిఖ్, శ్రీ పీయూష్ పటేల్, శ్రీమతి కల్పనా శుక్లా, శ్రీమతి దీప్తి జాని, శ్రీ ప్రదీప్ కట్ట, శ్రీమతి సుమా రెడ్డి, శ్రీ విలాస్ జంబుల, శ్రీ అరవింద్ పటేల్, శ్రీ అమిత్ పాండే, శ్రీ ఆనంద్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
విజయోత్సవ సభ కార్యక్రమం అనంతరం విందు ఏర్పాటు చేయబడింది. పశ్చిమ బెంగాల్ (West Bengal) విజయాన్ని పురస్కరించుకొని బెంగాలీ ప్రత్యేక వంటకం “జాల్మురి” వడ్డించగా, చారిత్రాత్మక విజయానికి గుర్తుగా కేక్ కటింగ్ (Cake Cutting) కార్యక్రమం నిర్వహించారు.