తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (Telangana American Telugu Association – TTA) నాయకత్వ బృందం ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి (Anumula Revanth Reddy) గారిని మర్యాదపూర్వకంగా కలిసింది.
ఈ సందర్భంగా డిసెంబర్ 25, 2025న హైదరాబాద్ (Hyderabad) లోని శిల్పకళావేదిక (Shilpakala Vedika) లో జరగనున్న TTA 10వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి ఆహ్వానం అందజేశారు.
TTA (Telangana American Telugu Association) నాయకత్వం ఇచ్చిన సాదర ఆహ్వానాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister) శ్రీ అనుముల రేవంత్ రెడ్డి (Anumula Revanth Reddy) గారు సంతోషంగా స్వీకరిస్తూ, ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలిపారు.
పదేళ్లుగా ప్రవాస తెలుగు సమాజానికి సేవలందిస్తూ, సాంస్కృతిక-సామాజిక కార్యక్రమాలతో విశేష గుర్తింపు పొందిన TTA (Telangana American Telugu Association) కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సమ్మతి లభించడం సంస్థకు గర్వకారణంగా నిలిచింది.
ఈ సందర్భంగా TTA నాయకులు ముఖ్యమంత్రిగారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ వేడుక ప్రవాస తెలుగు సంఘాల చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. TTA (Telangana American Telugu Association) నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఉత్సహంగా ఫోటోలు దిగి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి ఆహ్వానం అందజేసిన TTA (Telangana American Telugu Association) నాయకత్వ బృందంలో అధ్యక్షులు నవీన్ రెడ్డి మల్లిపెద్ది (Naveen Reddy Mallipeddi), డా. విజయపాల్ రెడ్డి, డా. మోహన్ రెడ్డి, భరత్ రెడ్డి మాదాడి, LN రెడ్డి, జ్యోతి రెడ్డి, విశ్వ కంది తదితరులు ఉన్నారు.