Connect with us

Health

పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా తానా ఫౌండేషన్ మెగా ఐ క్యాంప్

Published

on

ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం మండలం, గుడ్లపల్లి గ్రామము నందు తానా ఫౌండేషన్ మరియు రోటరీ హాస్పిటల్ సంయుక్తముగా మార్చి 19న మెగా ఐ క్యాంపు నిర్వహించారు. విజయవంతంగా ముగిసిన ఈ క్యాంపులో సుమారు 350 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్ళ జోళ్ళు పంచడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన గ్రామ పెద్దలు తానా ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి నాగ కొండలరావు అబ్బూరి స్పాన్సర్ చేసారు. ఈ కార్యక్రమానికి గుడ్లపల్లి గ్రామ వాస్తవ్యులు నందకుమార్ ఆలూరి, తానా ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తమ చౌదరి గుడే సమన్వయకర్తలుగా వ్యవహరించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected