Connect with us

Celebrations

డెలావేర్, మిడిల్ టౌన్ లో ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు

Published

on

డెలావేర్ రాష్ట్ర, మిడిల్ టౌన్ లోని సత్యా పొన్నగంటి స్వగృహంలో మహానటుడు, గొప్ప మనిషి, రాజకీయ ధురందరుడు, ప్రజల ఆరాధ్యదైవం, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలుగు ప్రజల గుండె చప్పుడు అయిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

అమెరికా డెలావేర్ రాష్ట్ర ఎన్నారై టీడీపీ కౌన్సిల్ సభ్యులు సత్య పొన్నగంటి, సుధాకర్ తురగ, శ్రీధర్ ఆలూరు మరియూ విశ్వనాథ్ కోగంటి ల అధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

సభ జరిగినంత సేపూ అభిమానులు “జోహార్ ! ఎన్టీయార్” అంటూ మిన్నంటిన నినాదాలతో ఆద్యంతం హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆయన కళారంగానికి రాష్ట్ర ప్రజానీకానికీ చేసిన ఇతోధిక సేవలను పలువురు కొనియాడి మరోసారి జ్ఞాపకం చేసుకోవటం జరిగింది.

ఆంధ్ర రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఆ మహానుభావుని ఆశయాలకు పునరంకితమవుతూ మన దార్శనికుడు శ్రీ చంద్రబాబు గారిని తిరిగి ముఖ్యమంత్రిగా తీసుకురావటానికి తీవ్ర కృషి చేయాలనీ, చేస్తాం అనీ సభికులందరూ ముక్తకంఠంతో ప్రతిన పూనటం జరిగింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected