Connect with us

Financial Assistance

మాట ప్రకారం మృతుల కుటుంబాలకు సాయం అందజేసిన మన్నవ మోహనకృష్ణ

Published

on

నూతన సంవత్సరం రోజున గుంటూరులో జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో మరణించిన వారి కుటుంబాలకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, నాట్స్ మాజీ అధ్యక్షులు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు మన్నవ మోహనకృష్ణ ఆర్ధిక సహాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వార్త కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

అప్పుడు చెప్పినట్టుగానే అమెరికా నుండి ఇండియా వెళ్ళగానే మాట నిలబెట్టుకున్నారు. మన్నవ మోహనకృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరణించిన వారి ఒక్కొక్క కుటుంబానికి 3,34,000 (మూడు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు) మొత్తం మూడు కుటుంబాలకు కలిపి 10,00,000 (పది లక్షల రూపాయలు) మన్నవ మోహనకృష్ణ ఈరోజు అందించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మాకినేని పెద రతయ్య, మాజీ ఎమ్మెల్యేలు ఆలపాటి రాజా, నక్కా ఆనంద బాబు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి కోవెలమూడి రవీంద్ర, గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాస్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టాబత్తిన చిట్టిబాబు, రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, భవిష్యత్తులోనూ వారి కుటుంబాలకు మన్నవ మోహనకృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ (Mannava Mohana Krishna Memorial Trust) ద్వారా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected