Connect with us

Associations

ఆటా 17వ మహాసభల కమిటీ ఫ్రారంభ సమావేశం

Published

on

అక్టోబర్ 23 వ తేదీన అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘ఆటా’ 17వ కాన్ఫరెన్స్ కమిటీ ఫ్రారంభ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆటా కాన్ఫరెన్స్ బృందం జూలై 1-3, 2022 న జరగనున్న ఆటా కాన్ఫరెన్స్ మరియు యూత్ కన్వెన్షన్ ను వైభవంగా నిర్వహించడం కోసం 200 మంది వాలంటీర్లతో 80 కమిటీ లను ఏర్పాటు చేసారు.

ఈ సమావేశాన్ని ఆటా అధ్యక్షుడు భువనేష్ బుజాల, కాన్ఫరెన్స్ అడ్వైజరీ చైర్ జయంత్ చల్లా, కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కోఆర్డినేటర్ కిరణ్ పాశం, కాన్ఫరెన్స్ డైరెక్టర్ కె కె రెడ్డి, కో-కన్వీనర్ సాయి సుదిని, కో-ఆర్డినేటర్ రవి చల్లా, కో-డైరెక్టర్ రవి బొజ్జా, మరియు స్థానిక కోఆర్డినేటర్ శ్రావణ్ పాడూరు నిర్వహించారు. ఈ కమిటీ ఫ్రారంభ సమావేశానికి ఆటా బోర్ద్ సభ్యులు న్యూజెర్సి రాష్ట్రం నుండి రవి గూడురు, శరత్ వేముల మరియు చికాగొ నగరం నుండి సీనియర్ ఆటా సభ్యులు చల్మ బండారు, మహేందర్ ముస్కుల పాల్గొనటం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం అధ్యక్షురాలు సుధ కొండపు పాల్గొని వచ్చె జూలై లో జరగనున్న ఈ 17 వ ఆటా మహోత్సవ వేడుకలకు రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం సహ ఆతిధ్య సంస్థగా వ్యవహరించడం పట్ల హర్షం వెలిబుచ్చారు. కాన్ఫరెన్స్ కమిటీ కోఆర్డినేషన్ టీమ్ సభ్యులు (హనిమి వేమిరెడ్డి, ప్రవీణ్ దాసరి, కౌశిక్ సామ, రవి చల్లా, హర్ష బారెంకబాయి మరియు లోహిత్ రెడ్ది) మాట్లాడుతు అందరి సహకారం తో 17 వ ఆటా మహోత్సవ వేడుకలు ఎంతో అధ్బుతంగా జరుపుకుంటామని ఆనందాన్ని వ్యక్తం చేసారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected