Connect with us

Politics

తణుకు మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణతో రాలీ నగర టీడీపీ అభిమానుల మీట్ & గ్రీట్

Published

on

పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నేత ఆరిమిల్లి రాధాకృష్ణ అమెరిగా టూర్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నార్త్ కరోలినా రాష్ట్రం, రాలీ నగరంలో టీడీపీ అభిమానులతో మీట్ & గ్రీట్ నిర్వహించారు. ఇందులో రాజేష్ యార్లగడ్డ, శ్రీధర్ గోరంటి తదితరులతోపాటు పలువురు స్థానిక తెలుగువారు మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

సునీల్ కాకర్ల ఆధ్వర్యంలో ఈ మీట్ & గ్రీట్ కార్యక్రమం జరిగింది. ఆరిమిల్లి రాధాకృష్ణ అందరితో కలివిడిగా కలిసిపోయి ఆత్మీయంగా మాట్లాడడం అందరినీ ఆకట్టుకుంది. టీడీపీ అభిమానులు ఆరిమిల్లి రాధాకృష్ణ ని శాలువా, పుష్పగుచ్చంతో సత్కరించారు. ఆరిమిల్లి రాధాకృష్ణ ఇంతకుముందు సింగపూర్లో ఉన్నప్పుడు సింగపూర్ తెలుగు సమాజం అనే తెలుగు సంస్థకి అధ్యక్షునిగా సేవలందించడం విశేషం. చివరిగా విందు భోజనంతో కార్యక్రమం ముగిసింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected