చంద్రబాబు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు దేశ ప్రగతికే మార్గదర్శకమయ్యిందని నందిగామ శాసన సభ్యురాలు (MLA) తంగిరాల సౌమ్య (Tangirala Sowmya) అన్నారు. జూన్ 27 తేదీ సాయంత్రం అమెరికా రాజధాని మెట్రో (Washington DC) ప్రాంతంలో, భాను మాగులూరి అధ్యక్షతన అభినందన సభ జరిగింది. ముందుగా ఎన్టీఆర్ (NTR) చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు.
అనంతరం MLA సౌమ్య (Tangirala Sowmya) మాట్లాడుతూ సాంకేతిక విద్య అభివృద్ధి చేయటం ద్వారా మీ అందరికీ అమెరికాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party)ని అధికారంలోకి తీసుకురావటానికి మీరు చేసిన కృషి మరపురానిది. కొందరు ప్రవాసాంధ్రులు ఇక్కడనుండి, మరి కొందరు అక్కడికి వచ్చి వివిధ రూపాలలో మీ వంతు సహాయ సహకారాలు అందించారన్నారు.
తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన (Satish Vemana) మాట్లాడుతూ… రాజధాని అమరావతి అభివృద్ధిలో ఎన్నారైలంతా భాగస్వాములు కావాలని, రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు (Nara Chandrababu Naidu) చేస్తున్న కృషికి మనవంతు సహకారం అందిస్తే రాష్ట్రం అభివృద్ధి పధంలో పయనిస్తుందన్నారు.
మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు (Mannava Subbarao) మాట్లాడుతూ… ప్రవాసాంధ్రులు అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా (Social Media) ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. పీ-4 లో ప్రవాసులంతా భాగస్వాములవ్వాలి అని కోరారు.. గత ప్రభుత్వ హయాంలో కూల్చివేతలే తప్ప నూతన కట్టడాలు ఏమీలేవు..ఈ ప్రభుత్వం నేడు శిధిలం నుండి శిఖరం వైపు నడిపిస్తున్నారన్నారు.
భాను మాగులూరి (Bhanu Maguluri) మాట్లాడుతూ.. చంద్రబాబు (Nara Chandrababu Naidu) గారి దార్శనికత వలన గతంలో సాంకేతిక రంగంలో గ్రామీణ స్థాయినుండి లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని రాణిస్తున్నారన్నారు. యువత భవితే రాష్ట్రప్రగతి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సతీష్ చింతా, రమేష్ ఆవిరినేని, రంజిత్ కోమటి, ఎండూరు సీతారామారావు, హనుమంతరావు కూచి, శ్రావ్య చామర్తి, కిషోర్ జాస్తి, చెరుకూరి ఇందుశేఖర్, నంబూరి చంద్రనాథ్, బండి సత్తిబాబు, చిట్టెల సుబ్బారావు, బూర్ల రామకృష్ణ, వనపర్తి నాగిరెడ్డి, వనమా లక్ష్మీనారాయణ, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.