Europe: తెలుగు దేశం పార్టీ (NRI TDP Europe) ఆధ్వర్యంలో మహానాడు (Mahanadu) 2025 వేడుకలు డబ్లిన్ (ఐర్లాండ్), కోపెన్హాగన్ (డెన్మార్క్), వాలెట్టా (మాల్టా) నగరాల్లో జూన్ 8న ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమం తెలుగువారి ఐక్యతకు అద్దంపడుతూ, సామాజిక, రాజకీయ చైతన్యానికి వేదికగా నిలిచింది.
కార్యక్రమంలో ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్ (PPD) వర్క్షాప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు, ఉద్యోగార్థులు, వీసా సందేహాలున్నవారికి 6 గంటలపాటు మెంటరింగ్ & మానిటరింగ్ ద్వారా మార్గదర్శకత్వం అందించబడింది. తెలుగు మహిళలు శ్రీ ఎన్టీఆర్ (NTR) విగ్రహానికి పూలమాలలు వేసి, మహానాడు (Mahanadu) కు ఘనంగా ప్రారంభం పలికారు.
అనంతరం ఎన్టీఆర్ 102వ జయంతి (NTR’s 102nd Birth Anniversary), ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం, నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినీ స్వర్ణోత్సవం, పద్మభూషణ్ (Padma Bhushan) పురస్కారం సందర్భంగా కేక్ కటింగ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి NRI TDP Ireland రీజినల్ కోఆర్డినేటర్ Dr కిషోర్ బాబు చలసాని (Dr Kishore Babu Chalasani) నాయకత్వం వహించి సభ్యులు ఉద్దేశించి ముఖ్య ప్రసంగం చేశారు. ఐర్లాండ్ మహానాడు (Ireland Mahanadu) నిర్వహణతో పాటు మొత్తం యూరప్ (Europe) స్థాయిలో సమన్వయంతో సమగ్రంగా ఈ మహానాడు (Mahanadu) విజయవంతంగా కొనసాగించేందుకు చొరవ చూపారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా APNRT చైర్మన్ Dr. రవికుమార్ వేమూరి (Dr. Ravikumar Vemuri) గారు జూమ్ ద్వారా పాల్గొని TDP Ireland చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రశంసించారు. ఇటువంటి వర్క్షాప్లకు ఒక SOP (Standard Operating Procedure) రూపొందించి పంపించాలని ఆదేశించారు. ఈ ప్రతిపాదనలువిశ్లేచించి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారి కోసం భవిష్యత్తులో ఇతర దేశాల్లో కూడా అమలు చేద్దమన్నారు.
CXO క్లబ్, వృత్తి అభివృద్ధి వేదికల ద్వారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గారు ప్రకటించిన 2 మిలియన్ ఉద్యోగాల లక్ష్యాన్ని సాధించేందుకు ఈ వర్క్షాప్ తోడ్పడుతుందని తెలిపారు. Import-Export బిజినెస్ అభివృద్ధికి APNRT దోహదపడుతుందని, అభివృద్ధి కార్యక్రమాల్లో NRIలు అర్ధ భాగస్వాములు అయితే సగ భగాన్ని ఏపీ ఎన్ఆర్టీ భరించేలా ప్రోత్సాహం ఉంటుందని హామీ ఇచ్చారు.
APNRT Director (Investments) శేషుబాబు కానూరి (Seshu Babu Kanuri) గారు కూడా అతిథిగా హాజరై, NRIలంతా APNRT భాగస్వాములుగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మహానాడు (Mahanadu) ఘనంగా నిర్వహించినందుకు టీడీపీ యూరప్ (TDP Europe) కృషిని ప్రశంచించారు. కాట్రగడ్డ వేంకట కృష్ణ ప్రసాద్ (Katragadda Venkata Krishna Prasad) APNRT సభ్యులకు లభించే ఉపయోగాలు మరియు ప్రోత్సాహకాలను వివరించారు. ఈ కార్యక్రమములో టీడీపీ యూరోప్ (TDP Europe) నాయకులూ విజయ్ అడుసుమిల్లి (Vijay Adusumilli), శ్యామ్ సుందర్ ఉట్ల (Shyam Sundar Utla), శ్రీనివాస్ గోగినేని (Srinivas Gogineni), చందు కాట్రగడ్డ (Chandu Katragadda), స్వాతి రెడ్డి (Swathi Reddy) జూమ్ ద్వారా పాల్గొన్నారు.
మహానాడు 2025లో ఆమోదించబడిన ముఖ్య తీర్మానాలు
• టీడీపీ ఐర్లాండ్ (TDP Ireland) & యూరోప్ (Europe) సభ్యత్వ విస్తరణ
• గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు
• వార్షిక ప్రోగ్రామ్స్ కమిటీ ఏర్పాటు
• ఈవెంట్ క్యాలెండర్ ఆవిష్కరణ
• నెట్వర్కింగ్ & కమ్యూనికేషన్ మెరుగుదల
ఈ మహానాడు కార్యక్రమం యువతలో చైతన్యం నింపుతూ, పరస్పర సహకారంతో, విశాల దృష్టితో, TEAM Europe ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడింది. అంతేకాక షడ్రుచులతో పసందైన విందు భోజనం ఏర్పాటుచేశారు.
విజయవంతమైన నిర్వహణకు కృషి చేసిన సభ్యులు
ఐర్లాండ్ (Ireland) :
• శ్రీనివాస్ పుట్టా
• కిషోర్ బాబు చలసాని
• వేంకట కృష్ణ ప్రసాద్ కాట్రగడ్డ
• అచ్చుత కిషోర్ కొత్తపల్లి
• భరత్ భాష్యం (ఐర్లాండ్ అధ్యక్షులు )
• రాజేష్ బాబు పల్లేటి
• దీప్తి కొణిదల
• శివ వేములపల్లి
• కోటేంద్ర లేళ్ల
• రంగ గల్లా
• ప్రముఖ్ గోగినేని
• శ్రీను
• శుభాకర్ రామినేని
• హరీష్ గణపనేని
• రామ్ వంగవోలు
• శ్రీకర్ మల్లికార్జున్ గుత్తా
డెన్మార్క్ (Denmark) :
• అమర్నాథ్ పొట్లూరి
• యాగంటి బాలకృష్ణ
• హరి చెరుకూరి
మాల్టా (Malta) :
• సుమంత్ బాబు పద్మాల
• సతీష్ ముళ్ళపూడి
• షేక్ అజహరుద్దీన్
• లత ముళ్ళపూడి
• నరేష్ చౌదరి తలపనేని
• గౌరవ్ జోషి