Connect with us

Government

వైట్ హౌస్ సౌత్ లాన్‌ లో మోడీ & బైడెన్ కార్యక్రమం, పాల్గొన్న ఎన్నారైలు

Published

on

అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ కి అడుగడుగున ఘన స్వాగతం లభిస్తోంది. వైట్ హౌస్‌కి చేరుకున్న మోడీకి జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఇరు దేశాధిపతులు భారత్, అమెరికా రక్షణ సహకారంపై ప్రధానంగా చర్చించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వైట్‌హౌస్ సౌత్‌లాన్‌లో వేడుక సందర్బంగా ఎన్నారైలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పాస్ లు ఉన్నవారిని అనుమతించారు.

అమెరికా తెలుగు సంఘం సంఘం నాయకులు ప్రదీప్ కట్ట, విలాస్ రెడ్డి జంబుల, శ్రీకాంత్ తుమ్మల, రఘువీరారెడ్డి, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాయకులు మధుకర్ రెడ్డి, సుధాకర్ గట్టు తదితరులు వీరిలో ఉన్నారు.

అలాగే తెలంగాణ డెవలపర్ ఫోరం మాజీ అధ్యక్షులు మురళీ చింతలపాణి, OFBJP మాజీ అధ్యక్షులు కృష్ణా రెడ్డి, రాజేందర్ రావు, భీమా పెంట, ఆదిత్య రాయుడు, KSN రాజు, రామకృష్ణ, పృద్వీ వైట్‌ హౌస్ వద్ద సౌత్ లాన్‌లో మోడీ పాల్గొన్న కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected