Connect with us

Financial Assistance

గుంటూరులో జనతా వస్త్రాల పంపిణీలో చనిపోయినవారికి మన్నవ మోహనకృష్ణ ఆర్ధిక సహాయం

Published

on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు నగరంలోని వికాస్ నగర్ లో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయినవారి ఒక్కొక్క కుటుంబానికి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ మన్నవ మోహన కృష్ణ 3 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం ప్రకటించారు.

అలాగే క్షతగాత్రులైనవారికి మన్నవ మోహన కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అని విధాలుగా అండగా ఉంటానని మన్నవ మోహన కృష్ణ పేర్కొన్నారు. వ్యాపార మరియు వ్యక్తిగత పనుల నిమిత్తం అమెరికా వచ్చిన మన్నవ మరో రెండు రోజుల్లో ఇండియా వెళ్లి వారి కుటుంబాలను కలిసి ఓదారుస్తానన్నారు.

చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని మన్నవ మోహనకృష్ణ ఈ సందర్భంగా ప్రార్ధించారు. దీంతో మన్నవ మోహన కృష్ణ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నట్టైంది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected