Connect with us

Financial Assistance

దాతృత్వానికి ఎల్లలు లేవని నిరూపించిన ఎన్నారైలు: పొట్లూరి రవి, కర్నూలు ఎన్నారై ఫౌండేషన్

Published

on

కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించడం తెలిసిన సంగతే. అయితే గత డిసెంబర్ 9 కర్నూలు నగరం నుండి శబరిమల యాత్రకు బయలుదేరి గమ్యం చేరుకునే లోపు కేరళ రాష్ట్రంలోని శివకోయిల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కర్నూలు నగరానికి చెందిన ఆదినారాయణ కుటుంబానికి ఈ సోమవారం రెండు లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించారు.

ఆదినారాయణ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాల్సిందిగా కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి కోరిన వెంటనే పలువురు ఎన్నారైలు ముందుకు వచ్చి సహాయం అందించారు. దీంతో తమ దాతృత్వానికి ఎల్లలు లేవని ఎన్నారైలు మరోసారి నిరూపించారు. ఎన్నారైలు అందించిన సహాయాన్ని జనవరి 3 సోమవారం నాడు కర్నూలు సిటీ డీఎస్పీ కేవీ మహేష్ ద్వారా ఆదినారాయణ కూతురు రేఖకు అందించారు.

అలాగే ఆదినారాయణ కుటుంబానికి అండగా ఉంటామని, కూతురు రేఖ చదువుకు సహకారం అందిస్తామని కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ కోఆర్డినేటర్ ముప్పా రాజశేఖర్ తెలిపారు. సీఐ తబరేజ్ మాట్లాడుతూ సహాయం అందించిన ఎన్నారైల సేవానిరతిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సందడి మధు, జంపాల అమిత్, నంది మధు, మీనాక్షి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected