Connect with us

Devotional

10 లక్షల విద్యార్థులతో అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన: TANA @ వందే విశ్వమాతరమ్

Published

on

. తానా (TANA) ఆధ్వర్యంలో డిసెంబర్ 18 న అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన
. ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల విద్యార్థులతో జరగనున్న అరుదైన కార్యక్రమం
. తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, వందేవిశ్వమాతరమ్ చైర్మన్ జయశేఖర్ తాళ్ళూరి వెల్లడి
. TANA ఆధ్వర్యంలో డిసెంబర్ 18 న పది లక్షల మంది విద్యార్థులతో అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన జరుగుతుంది

అమృతమూర్తి అయిన అమ్మ గురించి, త్యాగమూర్తి అయిన నాన్న గురించి, ఆదర్శమూర్తి అయిన గురువు గురించి, పద్యాలు పాడటం కంటే మరోభాగ్యం, మహాభాగ్యం ఇంకా ఏముంటుంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం TANA మరియు 100 దేశాల లోని తెలుగు సంఘాల (Telugu Associations) ఆధ్వర్యంలో శత శతక కవి చిగురుమళ్ళ శ్రీనివాస్ Africa to America అంటూ ‘వందే విశ్వమాతరమ్‘ పేరుతో 100 దేశాలలో శాంతి, సద్భావనా యాత్ర కు శ్రీకారం చుట్టారు.

ప్రపంచ సాహిత్య చరిత్రలో అపూర్వమైన ఘట్టంగా చెప్పదగిన ఈ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక చైతన్య యాత్ర లో భాగంగా అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన నిర్వహింపబడుతుంది అని తానా (Telugu Association of North America) అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు (Niranjan Srungavarapu), తానా పూర్వ అధ్యక్షులు & వందే విశ్వమాతరమ్ చైర్మన్ జయశేఖర్ తాళ్లూరి (Jay Talluri) తెలిపారు.

చిగురుమళ్ళ శ్రీనివాస్ (Chigurumalla Srinivas) రచించిన అమ్మ శతకం, నాన్న శతకం, గురువు శతకాలలోని పద్యాలు పిల్లలతో కంఠస్థం చేయించి, డిసెంబర్ 18న ఎవరి విద్యా సంస్థల్లో వారు ఉదయం 9 గంటలకు సామూహిక పద్య గానం చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాల (Telugu Associations) ఆధ్వర్యంలో తెలుగు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అని వారు వెల్లడించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected