Connect with us

Telugu

భాషా వైభవానికి అద్భుత వేడుకగా తెలుగు బడి వార్షికోత్సవం – Telugu Samiti of Nebraska & TANA పాఠశాల @ Omaha

Published

on

మే 16, 2026న Telugu Samiti of Nebraska మరియు TANA Paatasala సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు బడి వార్షికోత్సవం మరియు గ్రాడ్యుయేషన్ వేడుకలు అత్యంత ఘనంగా, ఆనందోత్సాహాల నడుమ జరిగాయి. విదేశీ నేలపై తెలుగు భాషా పరిరక్షణకు అంకితభావంతో కొనసాగుతున్న తెలుగు బడి మరో విజయవంతమైన విద్యా సంవత్సరాన్ని పూర్తి చేసుకుంది.

2025–2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫైనల్ పరీక్షలను విద్యార్థులు విజయవంతంగా పూర్తి చేయగా, మొత్తం 62 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరై విద్యార్థులను (Students) చప్పట్లతో అభినందించారు. చిన్నారుల ఆనందం, తల్లిదండ్రుల గర్వం, ఉపాధ్యాయుల సంతృప్తి కలిసి సభను భావోద్వేగభరితంగా మార్చాయి.

తెలుగు సమితి ప్రస్తుత అధ్యక్షుడు కొల్లి ప్రసాద్ (Prasad Kolli) గారు మాట్లాడుతూ, Telugu Samiti of Nebraska తరఫున TANA Paatasala తో జరిగిన అద్భుతమైన సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రారంభం నుండి ముగింపు వరకు సాగిన ఈ ప్రయాణం రెండు సంస్థల మధ్య నమ్మకాన్ని, అనుబంధాన్ని మరింత బలోపేతం చేసిందని పేర్కొన్నారు.

ఈ సహకార బంధాన్ని నిర్మించడంలో దూరదృష్టి మరియు ప్రేరణతో ముందుండిన శ్రీ రాజా కాసుకర్తి (Raja Kasukurthi) గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో విశేష సహకారం అందించిన శ్రీ భాను (Bhanu Maguluri) గారు మరియు శ్రీ శేఖర్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

అలాగే కొల్లి ప్రసాద్ (Prasad Kolli) గారు పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులతో పాటు ముఖ్యంగా తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలతో తప్పకుండా తెలుగులో మాట్లాడాలని సూచించారు. మన భాషే మన సంస్కృతి, సంప్రదాయాలు మరియు మూలాలకు ప్రతిబింబమని, తెలుగు (Telugu Language) మాట్లాడటం ద్వారా పిల్లలు తమ వారసత్వానికి మరింత దగ్గరవుతారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ప్రధానోపాధ్యాయులు వేణు మురకొండ గారు విశేష కృషి చేశారు. మొత్తం కార్యక్రమాన్ని సమన్వయం చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు (Parents) మరియు ఉపాధ్యాయులతో కలిసి ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు.

గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను శ్వేత బొడెపూడి గారు, పావులూరి సత్యనారాయణ గారు, నవీన్ కంటెం గారు మరియు నాగరాజు ముద్దెల్లి గారు విద్యార్థులకు అందజేసి, తెలుగు భాషను (Telugu Language) ఆసక్తిగా నేర్చుకుని ధైర్యంగా మాట్లాడాలని ప్రోత్సహించారు.

తెలుగు బడి ఉపాధ్యాయులు (Teachers) రాజా గారు, ఉమా గారు, పవిత్ర గారు, దివ్య గారు, సుధీర్ గారు, స్వప్న గారు, వీణామాధురి గారు, సువర్ణరేఖ గారు, మౌనిక గారు, సుహిత గారు మరియు తనూజ గారు విద్యార్థులకు తెలుగు భాషను ప్రేమగా బోధిస్తూ వారిలో భాషపై ఆసక్తి పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషించారు. వారి అంకితభావం, సహనం మరియు కృషిని తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందించారు.

సర్టిఫికెట్లను అందుకుంటున్న సమయంలో ఉపాధ్యాయులు భావోద్వేగానికి లోనై, తెలుగు బడి కేవలం భాషను నేర్పించే వేదిక మాత్రమే కాకుండా, పిల్లలకు సంస్కృతి, సంప్రదాయాలు మరియు కుటుంబ విలువలను చేరవేసే ఒక అందమైన కుటుంబమని భావోద్వేగంగా పంచుకున్నారు. పిల్లలు తెలుగు భాషను (Telugu Language) నేర్చుకొని తమ మూలాలతో మరింత దగ్గరవ్వాలని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ, విదేశాల్లో పెరుగుతున్న తమ పిల్లలు తెలుగు మాట్లాడటం ఎంతో ఆనందంగా ఉందని, తెలుగు బడి (Telugu Badi) చేస్తున్న సేవలు అమూల్యమని కొనియాడారు. సర్టిఫికెట్ల పంపిణీ అనంతరం పిల్లల కోసం ఫేస్ పెయింటింగ్, సరదా ఆటలు మరియు వినోద కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్వేత గారు వాలంటీర్‌గా ముందుకు వచ్చి పిల్లలందరికీ ఫేస్ పెయింటింగ్ చేస్తూ వారిని ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొనేలా చేశారు. అలాగే దివ్య గారు, పవిత్ర గారు మరియు మౌనిక గారు నిర్వహించిన ఆటల కార్యక్రమాలు చిన్నారులను ఎంతో ఆకట్టుకున్నాయి.

పిల్లలు ఆటల్లో పాల్గొంటూ ఆనందంగా గడపడం అందరినీ అలరించింది. పిల్లల కోసం పిజ్జా, స్నాక్స్ మరియు ఇతర అల్పాహారాలను Telugu Samiti of Nebraska సభ్యులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. చిన్నారుల నవ్వులు, ఉత్సాహం మరియు సందడి కార్యక్రమానికి మరింత అందాన్ని తీసుకొచ్చాయి.

తెలుగు బడి ప్రిన్సిపాల్ Venu Murakonda గారు మరియు వారి ముఖ్య బృందం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం నుండి ముగింపు వరకు అత్యంత సమర్థవంతంగా ప్రణాళిక చేసి అద్భుతంగా నిర్వహించారు. వారి అంకితభావం, నిరంతర శ్రమ, నాయకత్వం మరియు నిజాయితీ గల కృషి లేకపోతే ఈ కార్యక్రమం ఇంత గొప్ప విజయాన్ని సాధించేది కాదు. వారి సేవలు నిజంగా అభినందనీయమైనవి.

ఈ వార్షికోత్సవం కేవలం ఒక విద్యా కార్యక్రమం మాత్రమే కాకుండా, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణకు ప్రతీకగా నిలిచింది. విదేశీ నేలపై పెరుగుతున్న పిల్లల్లో తెలుగు పట్ల ప్రేమ, గౌరవం మరియు అనుబంధాన్ని పెంపొందిస్తూ, భవిష్యత్ తరాలకు మన భాషా వారసత్వాన్ని అందించే గొప్ప వేదికగా తెలుగు బడి (Telugu Badi) నిలుస్తోంది.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన ఉపాధ్యాయులు, వాలంటీర్లు, తల్లిదండ్రులు మరియు ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మన తెలుగు భాష యొక్క గొప్పతనం ప్రపంచవ్యాప్తంగా విరాజిల్లాలని, భవిష్యత్ తరాలకు తెలుగు (Telugu) వెలుగు ఇలాగే అందాలని అందరూ ఆకాంక్షించారు.

error: NRI2NRI.COM copyright content is protected