Connect with us

Patriotism

న్యూయార్క్ నడిబొడ్డున ఆజాదీకా అమృత మహాత్సవంలో పాల్గొన్న ‘తానా’ లీడర్షిప్

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ సంఘం వారు న్యూయార్క్ నగరం నడిబొడ్డున ఇండియా 75వ స్వాతంత్ర సంబరాలు ఘనంగా నిర్వహించారు. FIA ఆధ్వర్యంలో అన్ని భారత సంఘాలు పాలుపంచుకున్న ఈ పరేడ్ లో తానా ఫ్లోట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తానా సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకర్షించాయి. చిన్నారులు ప్రదర్శించిన లంబాడి నృత్యాలు, దేశభక్తి గీతాలు, కూచిపూడి నృత్యాలు, అల్లూరి సీతారామ రాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, ఝాన్సీ లక్ష్మీబాయి వెషాలు న్యుయార్క్ నగరంలొ సందర్శకులను ఆకట్టుకున్నాయి.

ప్రతి సంవత్సరం న్యూయార్క్ నగరంలో లక్షలాదిమంది భారతీయులందరు పాల్గొనే ఈ సంబరాలలో ప్రముఖ తెలుగు హీరో అల్లు అర్జున్ ముఖ్య అతిధి గా పాల్గొనడం, ప్రముఖ నిర్మాత నవీన్ యెర్నేని మరియు ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ అతిథిలుగా పాల్గొనడం తెలుగు వారికి గర్వకారణం అని అందరూ కొనియాడారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ ఒక తెలుగు వాడిగా దేశం మొత్తం జరుపుకునే ఈ పండుగలొ పాల్గొనడం చాలా ఆనందంగా వుంది అని అన్నారు.

తానా పరేడ్ ఫ్లోట్ ని తెలుగు స్వతంత్ర సమరయోధుల చిత్రాలతొ, భారత జాతీయ జెండాలు, తానా జెండాలు మరియు మువ్వన్నెల బెలూన్లతో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా తానా అధ్యక్షులు లావు అంజయ చౌదరి మాట్లాడుతూ తానా ఎప్పుడూ మాతృ దేశానికి సేవ చేయడానికి ముందు ఉంటుందని చెప్పారు.

తానా సేవల సమన్వయకర్త రాజా కసుకుర్తి మరియు బోర్డ్ కొశాధికారి లక్ష్మి దేవినేని మాట్లాడుతూ అమెరికాలో వున్నా మేము అందరం తానా ద్వారా కర్మ భూమితోపాటు మాత్రు భూమికి సేవ చేయటానికి ముందు ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షులు జయ్ తాళ్లూరి, జాని నిమ్మలపూడి , శ్రీనివాస్ ఒరుగంటి, విద్య గారపాటి, దిలీప్ ముసునూరు, శిరీష తూనుగుంట్ల, శ్రీ కొనంకి, సుధీర్ నారెపలెపు, శివాని, శ్రీలక్ష్మి అద్దంకి, ద్రువ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected