Connect with us

News

TDP రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా NRI సతీష్ వేమన నియామకం

Published

on

అమరావతి, ఆంధ్రప్రదేశ్, మార్చి 6, 2024: రాయలసీమ ప్రాంతం రైల్వే కోడూరుకు చెందిన తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఈరోజు నియమించారు. దీంతో సతీష్ వేమన TDP (Telugu Desam Party) రాష్ట్ర కమిటీలో సేవలందించనున్నారు. ఈ సందర్భంగా పలువురు NRIలు, టీడీపీ అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సతీష్ వేమన మాట్లాడుతూ టీడీపి జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected