Connect with us

Donation

NRI Jana Sena: ‘నా సేన కోసం నా వంతు’ విరాళం కొణిదెల నాగబాబుకి అందజేత

Published

on

కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీకి ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా “ఎన్ఆర్ఐ జనసేన టీమ్” రూ 4,30,079 విరాళం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు (Konidela Nagababu) చేతుల మీదుగా చెక్కు రూపంలో జనసేన పార్టీకి అందజేశారు.

వేణు పులుగుజ్జు మరియు పృథ్వీ యన్నం ఆధ్వర్యంలో NRI Jana Sena Team సమిష్టిగా ఈ విరాళం సేకరించి జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కార్యక్రమానికి విరాళంగా ఇచ్చారు. చెక్ అందజేసిన వారిలో ఎన్ఆర్ఐ జనసేన టీమ్ సభ్యులు గోపాలకృష్ణ గూడపాటి, తేజ దామెర్ల, బాలు పులుగుజ్జు, తుకారాం పులుగుజ్జు, నాగార్జున అల, సురేష్ బర్మా, సిద్దార్థ కంచెర్లపాటి తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Konidela Pawan Kalyan) చేస్తోన్న పోరాటానికి ఎన్ఆర్ఐ జనసేన టీమ్ మద్దతుగా నిలబడడం అభినందనీయమని, మంచి పరిపాలన ప్రజలకు అందించటమే జనసేన లక్ష్యమని అన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected