Connect with us

Sports

అట్లాంటాలో ‘నాటా’ వాలీబాల్ & త్రోబాల్ టోర్నమెంట్స్ విజయవంతం

Published

on

నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘నాటా’ అట్లాంటా విభాగం నిర్వహించిన వాలీబాల్ మరియు త్రోబాల్ టోర్నమెంట్స్ విజయవంతంగా ముగిశాయి. మే 7 శనివారం రోజున పురుషులకు వాలీబాల్ మరియు మహిళలకు త్రోబాల్ టౌర్నమెంట్స్ నిర్వహించారు.

రాస్వెల్ నగరంలోని స్థానిక డాన్ వైట్ మెమోరియల్ పార్క్ లో నిర్వహించిన ఈ వాలీబాల్ మరియు త్రోబాల్ టోర్నమెంట్స్ కి మంచి స్పందన వచ్చింది. విజేతలకు టోర్నమెంట్స్ నిర్వాహకులు ట్రోఫీలు అందజేశారు. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ విజేత క్లౌడ్ ఆల్ఫారెటా జట్టు, రన్నర్ అప్ పంజాబ్ జట్టు. ఈ సందర్భంగా క్రీడాకారులు నాటా నేతలను అభినందించారు.

ఈ క్రీడా కార్యక్రమంలో నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘నాటా’ అట్లాంటా విభాగం నేతలు శ్రీనివాస్ కోట్లూర్, రవి కందిమళ్ల, వెంకట్ మొండెద్దు, గురు పరదారమి మరియు శ్రీనివాస్ కుక్కాడపు తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాతలు యస్.కె.ఏ రియాల్టీ సర్వీసెస్ నుంచి శ్రీనివాస్ కుక్కాడపు, రాపిడ్ ఐటీ నుంచి గౌతం గోలి, సువిధ గ్రాసరీస్ మరియు మయూరి ఇండియన్ గ్రిల్.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected