Connect with us

Movies

అట్లాంటా వెంకట్ నటించిన మిస్టరీ సినిమా విడుదల అక్టోబర్ 6న

Published

on

పీవీ ఆర్ట్స్ పతాకంపై సాయికృష్ణ తల్లాడ దర్శకత్వంలో వెంకట్ పులగం నిర్మాతగా తెరకెక్కిన తెలుగు సినిమా మిస్టరీ (Mystery). తనికెళ్ల భరణి, అలీ, సుమన్, ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా లో సాయికృష్ణ, స్వప్న చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ప్రముఖ ఎన్నారై, అట్లాంటా వాసి వెంకట్ దుగ్గిరెడ్డి (Venkat Duggireddy) కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఉత్తర అమెరికా తెలుగు సమితి (NATA) రీజినల్ వైస్ ప్రెసిడెంట్ గా సేవలందిస్తున్న వెంకట్ దుగ్గిరెడ్డి డిటెక్టివ్ రోల్ లో కనిపించనున్నట్టు సమాచారం.

ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో వెంకట్ దుగ్గిరెడ్డి నాచురల్ గా నటించారని ప్రముఖ నటులు సుమన్ (Actor Suman) కూడా ప్రెస్ మీట్ లో పొగిడిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నట్టు, అనంతరం అక్టోబర్ 6న విడుదల చేస్తున్నట్లు నిర్మాత వెంకట్ పులగం తెలిపారు.

డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ.. ఇది ఒక కామెడీ థ్రిల్లర్ (Suspense Thriller) సినిమా, అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ఈ రోజు టీం సభ్యులు ఉన్న పోస్టర్ ని విడుదల చేసాం. ఈ ప్రాజెక్ట్ నేను చేయడానికి సహకారం చేసిన మా టీం సబ్యులకు ధన్యవాదాలు. అలానే వెంకట్ దుగ్గిరెడ్డి, రవి రెడ్డి, బాబీ కి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు.

సత్య శ్రీ, గడ్డం నవీన్, అకెల్లా, సి.కే.రెడ్డి, శోభన్ లు నటిస్తున్న ఈ సినిమాకి కథ మాటలు శివ కాకు, సంగీతం రామ్ తవ్వ, కెమేరా సుధాకర్ బార్ట్లే మరియు ఎడిటింగ్ సూర్య తేజ గంజి చేస్తున్నారు. అందరూ అక్టోబర్ 6 కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected