Connect with us

Birthday Celebrations

ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు; మన్నవ మోహన కృష్ణ ఆధ్వర్యంలో CBN జన్మదిన వేడుకలు

Published

on

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని వేలాది మంది ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు మన్నవ మోహన కృష్ణ ఏర్పాటు చేసారు.

నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని వేలాది మంది ముస్లిం సోదరులకు మన్నవ మోహన కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మన్నవ మోహన కృష్ణ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఉపవాసదీక్షలో పాల్గొన్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నానని, నిరంతరం ప్రజా సంక్షేమం కోసం, ఆంధ్ర రాష్ట్ర భవిత కోసం, 73 ఏళ్ళ వయస్సులో అలుపెరుగని కృషి చేస్తున్న నిత్య శ్రామికుడు చంద్రబాబు అని అన్నారు.

భావితరాల భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలను తెలియచేసి అల్లాహ్ చల్లగా చూడాలని, ఈ పవిత్ర రంజాన్ మాసంలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మంచి జరగాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు మన్నవ మోహన కృష్ణ ఆకాంక్షించారు.

అన్ని విధాలుగా వైసీపీ పాలనలో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడే సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు గారే అని ప్రజలందరూ చంద్రన్న పాలనను కోరుకుంటున్నారని, మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగు దేశం పార్టీ అని, ఉర్ధూను రెండో అధికార భాషగా చేసిన ప్రభుత్వం తెలుగు దేశం ప్రభుత్వం అనీ, మైనారిటీ వర్గంలో ఉన్న పేదలను ఆదుకునేందుకు 1985 లోనే ఎన్టీఆర్ మైనారిటీ కార్పొరేషన్ తీసుకువచ్చారని అన్నారు.

అలాగే మైనార్టీలకు రంజాన్ తొఫా, దుల్హన్ పథకం, విదేశీ విద్య, మస్జిద్, ఈద్గా అభివృద్దికి నిధులు, షాదిఖానాలు, ఖబర్ స్థాన్ ల అభివృద్ది, ఇమామ్, మోజమ్ల కు గౌరవ వేతనం ఇలా ఇంకా మరెన్నో సంక్షేమ పథకాలతో మైనారిటీలను అభివృధి చేయాలనే సంకల్పంతో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తే జగన్ రెడ్డి వచ్చాక అన్ని రద్దు చేసి మైనారిటీలను జగన్ రెడ్డి నమ్మించి మోసం చేసారని అన్నారు.

తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా మైనారిటీ సోదరులకు అండగా ఉంటుందని ఈసారి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అని మన్నవ మోహన కృష్ణ అన్నారు. ఈ సందర్భంగా తమకు పెద్దపిటా వేస్తూ మైనార్టీలను అభివృధి చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

మైనారిటీలకు ఏ కష్టంవచ్చిన అండగా నిలబడుతున్న మన్నవ మోహన కృష్ణ గారికి ముస్లిం సోదరులు ధన్యవాదాలను తెలియచేశారు. ఇఫ్తార్ విందును స్వీకరించిన ముస్లిం సోదరులకు మన్నవ మోహన కృష్ణ ధన్యవాదాలు తెలియచేశారు. ఈ ఇఫ్తార్ విందుకు వేలాదిమంది ముస్లిం సోదరులు హాజరవ్వడం విశేషం.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected