Connect with us

Donation

జయ్ తాళ్ళూరి దాతృత్వం, మరో పేద విద్యార్థినికి ల్యాప్టాప్ బహుకరణ

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ మాజీ అధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి మరో పేద విద్యార్థినికి ల్యాప్టాప్ అందజేశారు. తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇరవెండి గ్రామానికి చెందిన కావ్యశ్రీ కొర్స ఎలక్త్రికల్ ఇంజనీరింగ్ చదువుతుంది.

నిరుపేద కుటుంబానికి చెందిన ఈ విద్యార్ధినికి చదువు రీత్యా మాజీ ఎంపిపి వంశీ క్రిష్ణ వల్లూరిపల్లి గారి ద్వారా తానా ఫౌండేషన్ ఆదరణ కార్యక్రమంలో భాగంగా ల్యాప్టాప్ వితరణగా అందజేశారు. జయశేఖర్ తాళ్ళూరి ఎప్పటికప్పుడు తన దాతృత్వాన్ని చాటుతూనే ఉన్నారు.

Jay Talluri

ఈ సందర్భంగా కావ్యశ్రీ మాట్లాడుతూ దాత జయశేఖర్ గారికి, ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు గారికి, ఫౌండేషన్ చైర్మెన్ వెంకట రమణ యార్లగడ్డ గారికి, వంశీ క్రిష్ణ వల్లూరిపల్లి గారికి మరియు ఆదరణ ప్రాజెక్ట్ సమన్వయకర్త రవి సామినేని గారికి కృతజ్ఞతలు తెలిపింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected