Connect with us

News

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు కోవిడ్ పాజిటివ్‌

Published

on

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు కోవిడ్ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆయనే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు, ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నానని కేటీఆర్ వెల్లడించారు. ఇటీవలి కాలంలో నన్ను కలిసిన వారంతా కోవిడ్ ప్రోటోకాల్ పాటించి టెస్టు చేయించుకుని జాగ్రత్తగా ఉండండి అని కేటీఆర్ ట్విటర్లో పేర్కొన్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. బుధవారం యశోదా ఆసుపత్రికి సీఎం కేసీఆర్‌ను పరీక్షల నిమిత్తం తరలించిన సమయంలో ఆయన వెంటే మంత్రి కేటీఆర్‌తో పాటు ఎంపీ సంతోష్ కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే గురువారం సంతోష్‌కు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ కాగా, నేడు కేటీఆర్ సైతం కరోనా బారిన పడ్డారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
error: NRI2NRI.COM copyright content is protected