Edison, New Jersey: సంప్రదాయం, సృజనాత్మకత, పర్యావరణ బాధ్యతలను సమన్వయం చేస్తూ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) న్యూజెర్సీ చిన్నారుల కోసం పర్యావరణహిత గణేశ విగ్రహాల తయారీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని సహజమైన మట్టితో అందమైన వినాయక విగ్రహాలను (Lord Ganesh) రూపొందించారు. వారి సృజనాత్మకత, కళాత్మక ప్రతిభతోపాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించాలనే బాధ్యత ప్రతి విగ్రహంలో ప్రతిబింబించింది.
చిన్నారులు కొత్త ఆలోచనలతో తమ ఊహాశక్తికి రూపమిస్తూ, ప్రత్యేకమైన ఆకృతులు, అందమైన వివరాలతో గణేశ విగ్రహాలను (Lord Ganesh) తయారు చేశారు. వారి ఉత్సాహం, అంకితభావం, సమష్టి కృషి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమం చిన్నారుల్లో (Kids) భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవంతోపాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహనను పెంపొందించింది. తాము తయారు చేసిన పర్యావరణహిత వినాయక విగ్రహాలను గర్వంగా ప్రదర్శించినప్పుడు వారి ముఖాల్లో కనిపించిన ఆనందం కార్యక్రమ విజయానికి నిదర్శనంగా నిలిచింది.
ఈ కార్యక్రమాన్ని అర్థవంతంగా, చిరస్మరణీయంగా మార్చిన చిన్నారులు, తల్లిదండ్రులు (Parents), వాలంటీర్లు (Volunteers) మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ ATA న్యూజెర్సీ (ATA New Jersey Chapter) హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది.
ఈ కార్యక్రమాన్ని ATA న్యూజెర్సీ రీజినల్ కోఆర్డినేటర్లు కృష్ణ మోహన్, ప్రసాద్ ఆకుల, ప్రదీప్ కట్టా; మెంబర్షిప్ చైర్ శ్రీకాంత్ తుమ్మల; రీజినల్ అడ్వైజర్ విలాస్ జంబుల (Vilas Reddy Jambula); బోర్డు సభ్యుడు సంతోష్ కొరం (Santosh Reddy Koram) సమన్వయంతో నిర్వహించారు.
న్యూజెర్సీ యూత్ టీమ్
ఇషితా రెడ్డి మూలే, అక్షిత్ ఆకుల, రిషిత జంబుల, ఇష్మితా రెడ్డి, షణ్ముఖప్రియ మూలే, దీక్ష కట్టా మరియు ఆయాన్ రెడ్డి తుమ్మల.