Omaha, Nebraska: ప్రవాస భూమిలోనూ తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను సజీవంగా నిలుపుతూ తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా (Telugu Samithi of Nebraska) ఆధ్వర్యంలో 2026 సంవత్సరంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలు మరియు సంక్రాంతి మహోత్సవం కార్యక్రమాలు నెబ్రాస్కాలోని తెలుగు సమాజానికి మరపురాని అనుభూతిని అందించాయి.
ఈ రెండు కార్యక్రమాలు పండుగ ఉత్సాహంతో పాటు సామాజిక ఐక్యతను మరింత బలపరిచాయి. సంక్రాంతికి ముందుగా నిర్వహించిన సంక్రాంతి (Sankranti) సంబరాలు ఒమాహాలోని హిందూ టెంపుల్ ఆఫ్ ఒమాహా (Hindu Temple of Omaha) ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు TSN కమిటీ అధ్యక్షుడు శ్రీ కొల్లి గారి నాయకత్వం వహించగా, ప్రవాస తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మలిచారు.
ఈ సందర్భంగా నిర్వహించిన చిన్నారుల ఫ్యాషన్ షో (Kids Fashion Show), పిండి వంటల పోటీలు, ముగ్గుల పోటీలు, కోలాటం, హరిదాసు కీర్తనలు, తెలుగు క్విజ్, డ్రాయింగ్ పోటీలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో, పురుషులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొనడంతో పండుగ శోభ మరింత పెరిగింది.
కార్యక్రమ ప్రాంగణాన్ని రంగురంగుల అలంకరణలు, గాలిపటాలు (Kites), పంటల ప్రతీకలతో ముస్తాబు చేయడం సంక్రాంతి పండుగ వైభవాన్ని మరింత ప్రతిబింబించింది. రోజంతా ఏర్పాటు చేసిన వ్యాపార స్టాల్స్ సందడిగా కొనసాగగా, చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ చురుకుగా పాల్గొని సంక్రాంతి ఆనందాన్ని ఉత్సాహంగా పంచుకున్నారు.
అనంతరం నిర్వహించిన సంక్రాంతి మహోత్సవం కార్యక్రమం పాటలు, నృత్యాలు, స్కిట్లు, వాద్య ప్రదర్శనలు (Instrumentals)తో తెలుగు సంస్కృతి వైభవాన్ని అద్భుతంగా ప్రతిబింబించింది. చిన్నారులు, యువత, పెద్దలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ప్రతి ప్రదర్శనలోనూ తెలుగు సంప్రదాయాల గొప్పతనం ప్రతిఫలించింది.
అంతేకాకుండా, 2025–2026 సంవత్సరానికి నూతనంగా ఎన్నికైన TSN ఎగ్జిక్యూటివ్ కమిటీ (EC Team)ను TSN ఉపాధ్యక్షులు శ్రీ తాతా రావు కొసూరి (Tata Rao Kosuri) గారు వేదికపై పరిచయం చేశారు. ఈ సందర్భంగా TSN యూత్ కమిటీ చైర్ క్రాంతి సుధా గారు యూత్ కమిటీ సభ్యులను వేదికపై పరిచయం చేసి, యువత పాత్రను వివరించారు. ఈ కార్యక్రమానికి ముగింపుగా TSN సెక్రటరీ శ్రీ అలగన్ కంచర్ల గారు తన ప్రసంగంతో కార్యక్రమానికి అధికారిక ముగింపు పలికారు.
ఈ మహోత్సవం సందర్భంగా, అనేక సంవత్సరాలుగా ప్రవాస భూమిలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న గౌరవనీయ అతిథులైన శ్రీ సాంబ శివరావు (Saamba Sivarao – Ex-CMO, ConAgra), శ్రీ కొల్లి రామకృష్ణ (CIO, BCBS Nebraska), శ్రీమతి క్రాంతి అడ్డిడం (TSN తొలి అధ్యక్షురాలు), శ్రీ శ్రీనివాస్ నెడునోరి (హిందూ టెంపుల్ ఆఫ్ ఒమాహా చైర్మన్) గార్లను వేదికపై ఆహ్వానించి ఘనంగా సన్మానించారు.
వారి సేవలను స్మరించుకుంటూ Telugu Samithi of Nebraska (TSN) తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అనంతరం, ఈ గౌరవ అతిథుల చేతులమీదుగా TSN తెలుగు బడి ఉపాధ్యాయినులు, ఉపాధ్యాయులకు వారి అమూల్యమైన సేవలకు గుర్తింపుగా ప్రత్యేక సన్మానం నిర్వహించారు. ఈ సన్మానం కార్యక్రమం సభకు మరింత గౌరవాన్ని చేకూర్చి, ఉపాధ్యాయుల్లో అపారమైన ఆనందాన్ని నింపింది.
ఈ సందర్భంగా TSN తెలుగు బడి ప్రిన్సిపాల్ శ్రీ వేణు మురకొండ (Venu Murakonda) గారు మాట్లాడుతూ, ఈ సంవత్సరం TSN తెలుగు బడిలో ఇప్పటివరకు ఎప్పుడూ లేనంతగా 61 మంది విద్యార్థులు నమోదు కావడం ఎంతో ఆనందదాయకమని, ఇది TSN చేస్తున్న విద్యా సేవలకు లభిస్తున్న గొప్ప గుర్తింపుగా పేర్కొన్నారు. ప్రవాస భూమిలో పిల్లల్లో తెలుగు భాషపై పెరుగుతున్న ఆసక్తి తెలుగు సమాజానికి గర్వకారణమని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు సంక్రాంతి సంప్రదాయాలను పరిచయం చేస్తూ భోగి పండ్ల (Bhogi Pallu) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పండ్లు, పువ్వులు, చెరకు ముక్కలతో నిర్వహించిన ఈ కార్యక్రమం చిన్నారుల్లో అపారమైన ఆనందాన్ని నింపి పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచింది.
TSN చరిత్రలో చారిత్రాత్మక మైలురాయి – స్టూడెంట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్
ఈ కార్యక్రమానికి మరింత విశిష్టతను చేకూర్చిన ముఖ్యమైన అంశం ఏమిటంటే, TSN చరిత్రలో తొలిసారిగా TSN స్టూడెంట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను అధికారికంగా ప్రకటించడం. యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా ఒమాహా (UNO), యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా లింకన్ (UNL) లో చదువుతున్న లేదా చేరబోయే తెలుగు విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా ఈ స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు TSN కమిటీ వెల్లడించింది. ప్రవాస భూమిలో తెలుగు విద్యార్థుల ఉన్నత విద్యకు బాటలు వేసే ఈ నిర్ణయం TSN చరిత్రలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది.
సమాజ భద్రతకు మరో ముందడుగు – Emergency Response Team
అదేవిధంగా, అత్యవసర పరిస్థితుల్లో తెలుగు సమాజానికి అండగా నిలిచేలా TSN ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ERT) ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఈ సందర్భంగా ప్రకటించారు. అనారోగ్యాలు, ప్రమాదాలు, సహజ విపత్తులు వంటి సందర్భాలలో తెలుగు కుటుంబాలకు మార్గదర్శకత్వం, సమాచార సహాయం, మానవీయ తోడ్పాటు