Chester Springs, Pennsylvania: అమెరికా పర్యటనలో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు గౌరు వెంకట్ రెడ్డిని (Gowru Venkata Reddy) ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. అమెరికా పర్యటనలో భాగంగా పెన్సిల్వేనియా (Pennsylvania) రాష్ట్రంలోని చెస్టర్ స్ప్రింగ్స్ నగరంలోని ప్రవాసాంధ్రులతో సమావేశమైన గౌరు వెంకట్ రెడ్డి ఎన్నారైలను పాణ్యం నియోజకవర్గ అభివృద్ధిలో సహకరించాలని కోరారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పాణ్యం నియోజకవర్గాన్ని మెగా ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చేస్తున్నారని, ఎమ్మెల్యే గౌరు చరిత నాయకత్వంలో పాణ్యం నియోజకవర్గం హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో కీలకపాత్ర పోషించనుందని ఎన్నారైలు తమ నైపుణ్యం, పెట్టుబడులతో ముందుకు వచ్చి తమవంతు పాత్ర పోషించాలని కోరారు.
కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ (Kurnool NRI Foundation) చైర్మన్, తానా బోర్డు సభ్యుడు పొట్లూరి రవి (Potluri Ravi) నిర్వహించిన ఈ సమావేశంలో జగదీశ్ రెడ్డి అనుముల, తానా రీజినల్ కోఆర్డినేటర్ ఫణి కంతేటి, మురళి రెడ్డి, బాలాజీ వీర్నాల (Balaji Veernala), ప్రసాద్ కునారపు, హరి తుబాటి, రవి చిక్కాల, కోటి యాగంటి, సురేష్ యలమంచి, లక్ష్మినరసింహ రెడ్డి కొండా తదితరులు పాల్గొన్నారు