Connect with us

Birthday Celebrations

ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ లో అట్టహాసంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

Published

on

యూరప్ ఖండంలోని ఐర్లాండ్ (Ireland) దేశంలో నివసిస్తున్న తెలుగు వారి ఆధ్వర్యంలో తెలుగు జాతి కీర్తి పతాకం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డా.నందమూరి తారకరామారావు శతజయంతి సందర్భంగా ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ (Dublin) నగరం లోని సుప్రసిద్ధ ఫీనిక్స్ పార్క్ లో ఉత్సవాలు అట్టహాసంగా నిర్వహించారు.

ప్రపంచంలో ఎక్కడా జరగని రీతిలో వినూత్నంగా ప్రకృతి అందాల నడుమ, ఆహ్లాదకరమైన వాతావరణంలో నందమూరి తారక రామారావు (NTR) శతజయంతి ఉత్సవాలు నిర్వహించడం విశేషం. తెలుగువారు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పించారు.

ఎన్టీఆర్ తెలుగు జాతికి అందించిన విశిష్ట సేవలు, మధుర స్మృతులు జ్ఞప్తి చేసుకొని తెలుగు సాంప్రదాయ రుచులు ఆస్వాదించి, ఎన్టీఆర్ (NTR) కు భారత రత్న ఇవ్వాలని ముక్తకంఠంతో కాంక్షించారు. అలాగే ఐర్లాండ్ భారత రాయబారికి ఆ వినతి పత్రాన్ని అందించాలని ఏకగ్రీవంగా తీర్మానించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected