Connect with us

Accidents

హైదరాబాద్ ప్రేమ్ కుమార్ రెడ్డి, రాజమండ్రి సాయి నరసింహ, వరంగల్ పావని గుళ్ళపల్లి మరణం, మెసాచుసెట్స్ షెఫీల్డ్ రోడ్డు ప్రమాదంలో మరో అయిదుగురు తెలుగు విద్యార్థులకి గాయాలు

Published

on

మెసాచుసెట్స్ రాష్ట్రంలోని షెఫీల్డ్ లో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగు విద్యార్థులు మరణించారు. వారు హైదరాబాద్ కి చెందిన ప్రేమ్ కుమార్ రెడ్డి, రాజమండ్రి కి చెందిన సాయి నరసింహ మరియు వరంగల్ కి చెందిన పావని గుళ్ళపల్లి అని ప్రాధమిక సమాచారం.

అలాగే మరో అయిదుగురికి గాయాలవడంతో బెర్కషైర్ ఆసుపత్రికి తరలించారు. స్థానిక కాలమానం ప్రకారం అక్టోబర్ 25 మంగళవారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. రెండు వెహికిల్స్ లోని డ్రైవర్స్ గాయాల పాలయ్యారు.

తానా టీం స్క్వేర్ సభ్యులు వివరాలు సేకరించి మృతదేహాలను ఇండియాకి పంపేలా సహాయం చేస్తున్నారు. 7 గురు తెలుగు విద్యార్థులు ప్రయాణిస్తున్న టయోటా మినీవాన్, షెవీ పికప్ ట్రక్ ఎదురెదురుగా గుద్దుకోవడంతో ఈ సంఘటన జరిగినట్లు తెలిసింది. వీరందరూ కనెక్టికట్ రాష్ట్రానికి చెందిన న్యూ హావెన్ నగరంలో మాస్టర్స్ చదువుకోవడానికి వచ్చినట్లు షెఫీల్డ్ పోలిస్ చీఫ్ ఎరిక్ మున్సన్ తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected