Connect with us

News

రెడ్డెప్పగారి శ్రీనివాస్ రెడ్డి తో బోస్టన్ తెలుగు తమ్ముళ్ల మీట్ & గ్రీట్

Published

on

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాస్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా బోస్టన్ విచ్చేసిన సంధర్భంలో NRI TDP New England విభాగం నిర్వహించిన మీట్ & గ్రీట్ కార్యక్రమానికి టీడీపీ అభిమానులు మరియు సానుభూతిపరులు హాజరయ్యారు.

శ్రీనివాస్ రెడ్డి తండ్రి కీ.శే. రాజగోపాల్ రెడ్డి ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎలా పనిచేశారో, 5 సార్లు ఎమ్ఎల్ఏ గా నిస్వార్థంగాప్రజలకు ఎలా సేవ చేశారో వివరించారు. నారా చంద్రబాబు నాయుడు విధానాలు మరియు వారి ఆలోచనా విధానం ఎలా ఉంటాయో వివరించారు.

శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం పార్టీ విధానం అయిన “సమాజమే ఒక దేవాలయం ప్రజలే దేవుళ్ళు” అంశము గురించి విపులీకరించారు. మన ప్రజాస్వామ్య ఎన్నికలు గ్రామం నుండి క్షేత్ర స్థాయీ వరకు ఎలా జరుగుతాయో విడమర్చి చెప్పారు. రాబోయే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరియు వారి భవిష్యత్తుకు ఎందుకు కీలకం అని ప్రస్థావించారు.

తెలుగు దేశం పార్టీ తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం మరియు భవిష్యత్తు కోసం ఎలా పనిచేసింది, అభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు అవిశ్రాంతంగా ఎలా పనిచేశారో విశదీకరించారు. శ్రీనివాస్ రెడ్డి ప్రతి ఎన్నారై ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పని చేయాల్సిన సమయం వచ్చింది, సమయం లేదు మిత్రమా రండి కలిసి పనిచేద్దాం అని పిలుపు నిచ్చారు.

ఇలా అన్ని విషయాలు, అడిగిన ప్రశ్నల గూర్చి ఓపికగా శ్రీనివాస్ రెడ్డి బదులు ఇచ్చిన విధానం మరియు శ్రీనివాస్ రెడ్డి నిస్వార్థ ప్రజాదృష్టి గురించి ఎన్నారై టీడీపీ సభ్యులు కొనియాడారు. ఈ సందర్భంగా NRI TDP New England శ్రేణులు రెడ్డెప్పగారి శ్రీనివాస్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected