Wilmington, Delaware: టిడిపి (TDP) వ్యవస్థాపక అధ్యక్షుడు విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) 102వ జయంతి వేడుకలతో పాటు ‘మినీ మహానాడు (Mini Mahanadu) – 2025’ కార్యక్రమం Delaware లోని Wilmington లో అంగరంగ వైభవంగా ముగిసింది.
శనివారం May 31 మధ్యాహ్నం 1 గంటకు మొదలైన ఈ ఈవెంట్ NRI TDP USA Delaware నేతలు నగర అధ్యక్షులు శ్రీ సత్య పొన్నగ౦టి (Satya Ponnaganti), నగర ఉపాధ్యక్షులు శ్రీ శ్రీధర్ (Sridhar), నేతలు శ్రీ శ్రీకా౦త్ గూడూరు (Srikanth Guduru), శ్రీ సూరజ్ కర్రా (Suraj Karra), శ్రీ సందీప్ వె౦పరాల (Sandeep Vemparala) అధ్వర్య౦ లో నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆ తర్వాత అన్న ఎన్టీఆర్ (NTR) కు ఘన నివాళులు అర్పించి వేడుకలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి అతిథులుగా Philadelphia NRI TDP USA నేతలు శ్రీ రాధాకృష్ణ మూల్పూరి (Radhakrishna Mulpuri), శ్రీ హేమంత్ ఎర్నేని (Hemanth Erneni) మరియు శ్రీ మురళి తోపాటుగా శ్రీ కిషోర్ కూకలకు౦ట్ల (Kishore Kukalakuntla), శ్రీ శ్రీనివాస్ చెన్నారెడ్డి (Srinivas Chenna Reddy), శ్రీ మధు (Madhu), AAA నేత శ్రీ హరిబాబు (Haribabu Thubati), శ్రీ విభీష్ (Vibhish) & మహిళాభిమానులు కూడా హాజరయ్యి రామారావు (Rama Rao) గారు ప్రవేశపెట్టిన పలు పథకాలను కొనియాడారు
అలాగే ఆ౦ధ్ర రాష్ట్ర అభివృద్ధికోస౦ విశేష కృషిచేస్తున్న శ్రీ చ౦ద్రబాబు (Chandrababu) గారిని, యువనేత శ్రీ లోకేష్ (Lokesh) గారిని అభినందించారు. అదేవిధంగా శ్రీ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గారికి పద్మభూషణ్ (Padma Bhushan) అవార్డు రావడం పట్ల అందరూ చాలా ఆనందం వ్యక్త౦చేసారు. Delaware NRITDPUSA మహానాడు (Mahanadu) 2025 ‘మహా’ విజయానికి కారకులైన వార౦దరితో వ౦దన సమర్పణ తో కార్యక్రమం ముగిసింది .