Connect with us

Donation

పెద్ద చేయిగా నిలిచిన సైజెన్ & TTA ఫౌండర్ డా. పైళ్ల మల్లారెడ్డి; తెలుగు రాష్ట్రాలకు చెరో కోటి విరాళం

Published

on

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వరదలు భీబత్సమ్ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ విపత్కర పరిణామాలకు చలించి, ఎప్పుడు దాత్రుత్వంలో పెద్ద చేయిగా నిలిచే అమెరికా పెద్దన్న, సైజెన్ గ్రూపు (ScieGen Pharmaceuticals) అధినేత & TTA ఫౌండర్ డా. పైళ్ల మల్లారెడ్డి సైజెన్ ఫార్మస్యూటికల్స్ గ్రూప్ ద్వారా, రెండు రాష్ట్రాలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి సహాయ నిధికి, చెరొక కోటి రూపాయలు విరాళం అందించారు.

ఈ సోమవారం సైజెన్ (ScieGen Pharmaceuticals) ప్రతినిధుల బృందం తెలంగాణ (Telangana) ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి (Anumula Revanth Reddy) ని తన నివాసంలో కలిసి కోటి రూపాయల చెక్కును అందించారు. దీనికి ముఖ్యమంత్రి డా. పైళ్ల మల్లారెడ్డి (Dr. Pailla Malla Reddy) మరియు సైజెన్ బృందాన్ని అభినందించి ధన్యవాదాలు తెలియజేసారు.

error: NRI2NRI.COM copyright content is protected