Connect with us

Associations

Norvay, Oslo: నార్వే దేశ రాజధాని ఓస్లో నగరంలో వైభవంగా నార్వే తెలుగు సంఘం 10 వసంతాల వేడుకలు, ఉగాది సంబరాలు

Published

on

Oslo, Norvay: నార్వే తెలుగు సంఘం (Norway Telugu Association – NTA) ఆధ్వర్యంలో 10 వసంతాల వేడుకలు మరియు ఉగాది సంబరాలు ఓస్లో నగరంలో అత్యంత వైభవంగా జరిగాయి. మార్చి 21న జరిగిన ఈ దశాబ్ది ఉత్సవాలు ప్రవాస భారతీయుల సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పాయి. సుమారు 350 మందికి పైగా తెలుగు వారు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.

ఈ కార్యక్రమానికి Akershus కౌంటీ డిప్యూటీ మేయర్ ఓలే జాకబ్ జోహన్సెన్ (Ole-Jacob Johansen), నార్వేలోని భారత రాయబార కార్యాలయ (Indian Embassy) సెకండ్ సెక్రటరీ శ్రీ ఎస్. మాగేష్ కుమార్, మరియు ఆస్కర్ మేయర్ శ్రీమతి లెనె కాన్రాడి (Mrs. Lene Conradi) విశిష్ట అతిథులుగా విచ్చేశారు.

భారతదేశం (India) నుండి ప్రముఖ నాయకుల వీడియో సందేశాలు ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు (Muppavarapu Venkaiah Naidu) గారు, కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ (Chandra Sekhar Pemmasani) గారితో పాటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 20 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు నార్వే తెలుగు వారిని అభినందిస్తూ సందేశాలు పంపారు.

కార్యక్రమ విశేషాలు

పిల్లల ప్రదర్శనలు: ఈ వేడుకలో పిల్లలు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు (Cultural Programs) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వారి ప్రతిభ, ఉత్సాహం ఈ కార్యక్రమాన్ని నిజంగా ప్రత్యేకంగా మార్చాయి.

సాంస్కృతిక వైభవం: స్టాక్‌హోమ్ నుండి వచ్చిన ‘అలెన్ స్కూల్ ఆఫ్ డాన్సెస్’ బృందం, నాట్య కళా భారతి డాక్టర్ సరళ కుమారి గారి కూచిపూడి నృత్యం (Kuchipudi Dance), మరియు ముద్ర డాన్స్ అకాడమీ వారి ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.

గౌరవ సత్కారం: ఈ పదేళ్ల ప్రయాణంలో తోడ్పాటునందించిన పాత కార్యవర్గ బోర్డు సభ్యులకు (Past NTA Board Members) ప్రత్యేక మెమెంటోలు ఇచ్చి ఘనంగా సత్కరించారు.

ఉగాది (Ugadi Festival) సంబరాలు వంటి కార్యక్రమాలతో తెలుగు సంస్కృతిని విదేశీ గడ్డపై పది కాలాల పాటు పదిలపరుస్తున్న నార్వే తెలుగు సంఘాన్ని (Norway Telugu Association – NTA) అతిథులు అందరూ ప్రత్యేకంగా కొనియాడారు.

error: NRI2NRI.COM copyright content is protected