Connect with us

Financial Assistance

Telangana లో పేద విద్యార్ధిని చదువుకు New Jersey సాయి దత్త పీఠం ఆర్ధిక సాయం

Published

on

మహబూబాబాద్ జిల్లా, డోర్నకల్ మండలం, Telangana, జూన్ 4: New Jersey సాయి దత్త పీఠం నిత్య అన్నదానం, సత్సంగ్, ఛారిటీ, విద్య ఈ నాలుగు మూల స్తంభాలుగా భావించి సేవలు అందిస్తోంది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్ధుల చదువుకు ఆర్థిక సాయం చేస్తుంది.

వెన్నారం గ్రామంలోని పేద వాడైన అర్చకుడు రామానుజం కుమార్తె చదువు కోసం, ఉన్నత విద్య కోసం సాయి దత్త పీఠం (Sai Datta Peetham) లక్ష రూపాయల ఆర్ధిక సాయం చేసింది. ఈ కార్యక్రమంలో సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం (Sri Siva Vishnu Temple) ఎస్డీపీ అయ్యప్ప గ్రూప్ గురుస్వాములు, స్వాములు అందరూ ఇతోధికంగా తమవంతు చేయూత అందించారు.

ఈ విధంగా రామానుజం కుమార్తె తన్మయి రామానుజం విద్యకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చే సంవత్సరం లో కూడా సాయం చేస్తామని సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి (Raghu Sankaramanchi) తెలిపారు. హైదారాబాద్‌ (Hyderabad) లో రామానుజం కుటుంబానికి లక్ష రూపాయల చెక్కును సాయి దత్త పీఠం చైర్మన్ రఘు శర్మ శంకరమంచి అందించారు.

error: NRI2NRI.COM copyright content is protected