Connect with us

Celebrations

NRI TDP Kuwait ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ వేడుకలు

Published

on

మే 13న ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన అలాగే బిజేపి ఘనవిజయం సాధించిన సందర్భంగా కువైట్ లో విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కువైట్ తెలుగుదేశం దేశం పార్టీ (NRI TDP Kuwait) నాయకుడు, గల్ఫ్ ఎంపవర్మెంట్ కో-ఆర్డినేటర్ శ్రీ కుదరవల్లి సుధాకర రావు (Kudaravalli Sudhakara Rao) ఆధ్వర్యములో ఈ వేడుకలను ఫర్వానియా ద్వైహి పాలస్ లో నిర్వహించారు.

ఈ సందర్భంగా సుధాకర రావు మాట్లాడుతూ.. ఇంత ఘనవిజయాన్ని అందించిన తెలుగు ప్రజలకు (Telugu People) ధన్యవాదాలు తెలియచేసారు. ఇప్పటి వరకు ఎన్నారైలు (NRI) అందరు సోషల్ మీడియాలో ఒక సైకో విద్వంస పాలనకు వ్యతిరేకంగా పోరాడాము. ఈ విజయం తరువాత మనమీద మరింత భాద్యత పెరిగింది అని, కూటమి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వాటిని ప్రజలకు తెలియ చేసే భాద్యత మన ఎన్నారైల మీద వుందని పేర్కొన్నారు.

ఈ కార్యకమంలో గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు శ్రీ వెంకట్ కోడూరి (Venkat Koduri), ఎన్నారై టిడిపి కువైట్ (NRI TDP Kuwait) అధ్యక్షుడు శ్రీ మద్దిన ఈశ్వర్ నాయుడు, సుంకవల్లి సత్య సాయి బాబా, కట్టా వేణు గోపాల్ స్వామి, సాయి కృష్ణ,కొల్లి ఆంజనేయులు, గాజులపల్లి సుబ్బా రెడ్డి, విసి సుబ్బారెడ్డి, ఈడుపుగంటి దుర్గాప్రసాద్, పిడికిటి శ్రీనివాస్ చౌదరి, చిన్నా రాజు, వంశీ కాపెర్ల, నరేష్, పెంచల్ సన్నపనేని, పెంచల్ రెడ్డి, మద్దిపట్ల శివ, పోలారపు బాబు నాయుడు, శ్రీనివాస్, మరియు జనసేన (Jana Sena Party) గల్ఫ్ కన్వీనర్స్ కాంచన శ్రీకాంత్, రామచంద్ర నాయక్.

కువైట్ (Kuwait) కో-ఆర్డినేటర్స్ బిరడా సూర్యనారాయణ, ఆకుల రాజేష్, ఇమ్మిడిసెట్టి సూర్యనారాయణ, జిలకర్ర మురళీ, దండు వేణు, మొదలగు వారు, అలాగే మహాసేన రాజేష్ రాపాక, బాలకృష్ణ పాల్గొన్నారు. చివరిగా భారీ కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియచేసుకున్నారు. వచ్చిన అతిదులకు పసందైన విందును ఎర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న అందరికి ఈశ్వర్ నాయుడు (Maddina Eswar Naidu) ధన్యవాదాలు తెలియచేసారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected