Connect with us

Health

Irving, Texas: మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఉత్సాహంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

Published

on

Dallas, Texas: అమెరికాలోనే అతి పెద్దదైన ఇర్వింగ్ (Irving) నగరంలో నెలకొనియున్న మహాత్మాగాంధీ మెమోరియల్ (Mahatma Gandhi Memorial) వద్ద జూన్ 21 న మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (Mahatma Gandhi Memorial of North Texas) ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో వందలాదిమంది ప్రవాస భారతీయులు (NRI) అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు.

గంటన్నరకు పైగా సాగిన యోగా (Yoga), ధ్యాన (Meditation) కార్యక్రమానికి ‘హార్ట్ ఫుల్నెస్’ (Heartfulness) యోగా సంస్థ సారధ్యం వహించింది. ఈ కార్యక్రమంలో ఇషా ఫౌండేష‌న్ (Isha Foundation), ది ఐ వై ఇసి (IYEC), ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ (The Art of Living Foundation), వన్ ఎర్త్ వన్ చాన్స్ (One Earth One Chance) కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ (Karya Siddhi Hanuman Temple), డి ఎఫ్ డబ్ల్యూ హిందూ టెంపుల్ (DFW Hindu Temple) మొదలైన సంస్థ‌ల నుంచీ వందలాదిమంది పాల్గొన్నారు.

మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక కార్యదర్శి (Founding Secretary) రావు కల్వాల (Rao Kalvaal) అతిథులందరికీ స్వాగతం పలికి, యోగా చేయడానికి సుప్రభాత సమయంలో తరలివచ్చిన వారందరికీ ధన్యవాదాలు అని సభను ప్రారంభించారు. మహాత్మా గాంధీ మెమోరియల్ కో ఛైర్మన్ (Co-Chairman) రాజీవ్ కామత్ (Rajeev Kamat) శుభాకాంక్షలు తెలియజేశారు.

మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు (Founding President) డాక్టర్ ప్రసాద్ తోటకూర (Dr. Prasad Totakura) మాట్లాడుతూ “యోగా, ధ్యానం కేవలం జూన్ 21న మాత్రమే కాక మన దైనందిన జీవితంలో దినచర్యలో ఒక భాగంగా చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందన్నారు. భారత ప్రధాని (Prime Minister of India) పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకోవడం ఆనందదాయకంగా ఉందని అన్నారు.”

ముఖ్య అతిథిగా హాజరైన ఇర్వింగ్ నగర మేయర్ (Mayor of Irving) రిక్ స్టాపర్ (Rick Stopfer) మహాత్మా గాంధీ మెమోరియల్ దశమ వార్షికోత్సవం (10th Anniversary) సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శిలాఫలకాన్ని ఆవిష్కరించి, అన్ని వయస్సుల వారు వందలాదిమంది ఈ రోజు యోగా‌లో పాల్గొనడం సంతోషదాయకం అని అన్నారు. ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిభావంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మహాత్మా గాంధీ మెమోరియల్ (Mahatma Gandhi Memorial) కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు.

మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర (Dr. Prasad Totakura) మరియు కార్యవర్గ సభ్యుల విజ్ఞప్తి ప్రకారం, అతిత్వరలో 5 మిలియన్ డాలర్లు (5 million USD) పైగా ధనాన్ని వెచ్చించి ఈ 18 ఎకరాల (18-acre) సుందరమైన పార్క్‌లో వాకింగ్ ట్రాక్స్ (Walking Tracks), ఎల్‌ఈడి విద్యుత్ దీపాలు మెరుగుపరుస్తామని ప్రకటించడంతో అందరూ హర్షధ్వానాలు చేశారు.

ప్రత్యేక అతిథులుగా హాజరైన కాపెల్ నగర (Coppell) కౌన్సిల్ (City Council) సభ్యులు బిజు మాథ్యూ (Bizu Mathew), రమేష్ ప్రేమ్ కుమార్ (Ramesh Prem Kumar), ఫ్రిస్కో ఇండిపెండెంట్ స్కూల్ ట్రస్టీ బోర్డ్ (Frisco Independent School District Trustee Board) సభ్యుడు సురేష్ మండువ (Suresh Manduva) ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమకెంతో సంతోషాన్ని కల్గించింది అంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర (Dr. Prasad Thotakura) సహచర కార్యవర్గ సభ్యులు రాజీవ్ కామత్ (Rajeev Kamat), రావు కల్వాల (Rao Kalvala), బి.ఎన్. రావు (B.N. Rao), తయాబ్ కుందావాల (Tayyab Kundawala), రాజేంద్ర వంకవాల (Rajendra Vankawala), రాంకీ చేబ్రోలు (Ranki Chebrolu), మహేంద్ర రావు (Mahendra Rao), జె. పి. పాండ్య (J.P. Pandya), రన్నా జానీ (Ranna Jani), అనంత్ మల్లవరప (Ananth Mallavarapu)తో కలిసికొని అతిథులను సత్కరించారు.

యోగా అనంతరం నిర్వాహకులు చక్కటి ఉపాహారాన్ని ఏర్పాటు చేశారు. గాంధీ మెమోరియల్ బోర్డ్ (Gandhi Memorial Board) సభ్యుడు బి.ఎన్. రావు (B.N. Rao) తన ముగింపు సందేశంలో యోగా కార్యక్రమంలో పాల్గొన్న వారికి, అతిథులకు, వివిధ ప్రసార మాధ్యమాలకు, ‘హార్ట్ ఫుల్నెస్’ (Heartfulness) యోగా సంస్థ నిర్వాహకులు సురేఖా కోయ (Surekha Koya), ఉర్మిల్ షా (Urmil Shah) మరియు వారి బృంద సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

error: NRI2NRI.COM copyright content is protected