Connect with us

Health

భారత దౌత్య కార్యాలయం ఆధ్వర్యంలో Washington D.C. లింకన్ మెమోరియల్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవం

Published

on

Washington, D.C. : అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ (Washington, D.C.) లోని లింకన్ మెమోరియల్ (Lincoln Memorial) వద్ద 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) భారత దౌత్య కార్యాలయం (Indian Ambassador) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా (Vinay Mohan Kwatra) ముఖ్య అతిథిగా పాల్గొని వేల మంది తో కలిసి యోగ (Yoga) సాధన చేశారు. వాషింగ్టన్ (Washington D.C.), వర్జీనియా (Virginia), మెరిలాండ్ (Maryland) ప్రాంతాల నుండి ప్రవాసులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.

భారత రాయబారి (Indian Embassy) కార్యాలయం ప్రత్యేకంగా బస్సులు మరియు భోజన సదుపాయాలను కల్పించింది. ఈ వేడుకలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నుండి విశ్వేశ్వర కళవల (Visvesvara Kalavala), రాము ముండ్రాతి (Ramu Mundrathi), ఈశ్వర్ బండా (Eshwar Banda), జయశ్రీ (Jayashree), నరసింహ తెలుకుంట్ల (Narasimha Telukuntla), వెంకట్ డండా (Venkat Danda) తదితరులు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected