Connect with us

Literary

తెలుగువారికే సొంతమైన విశిష్ట సాహితీ ప్రక్రియ అష్టావధానం @ NATS Convention, Tampa, Florida

Published

on

Tampa, Florida: నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) 8వ అమెరికా తెలుగు సంబరాల ఏర్పాట్లు కన్వీనర్ & నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ (Srinivas Guthikonda), నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni), నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి (Srihari Mandadi) మరియు నాట్స్ ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి (Madan Pamulapati) సారధ్యంలో యమా స్పీడుగా సాగుతున్నాయి.

ప్లోరిడా (Florida) రాష్ట్రంలోని టాంపా (Tampa) నగర వేదికగా జులై 4,5,6 తేదీల్లో జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల (Convention) కోసం ఇప్పటికే టాలీవుడ్ అగ్ర నటీనటులు రానుండడంతో టాక్ ఆఫ్ ది అమెరికా గా ఉన్న నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాలలో మరో కొత్త కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు.

తెలుగువారికే సొంతమైన విశిష్ట సాహితీ ప్రక్రియ అయినటువంటి అష్టావధానం (Ashtavadhanam) ప్రవాసులను ఆకట్టుకునేలా నిర్వహించనున్నారు. బ్రహ్మశ్రీ నేమాని సోమయాజులు గారు అవధానిగా, శ్రీనివాస భరద్వాజ కిషోర్ సంచాలకులుగా భాస్కర్ రాయవరపు లేఖకునిగా వ్యవహరించనున్నారు.

ఈ ప్రత్యేక సాహితీ కార్యక్రమంలో తెలుగు సినీ రంగానికి చెందిన తనికెళ్ళ భరణి (Tanikella Bharani) మరియు రామ జోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry) తదితరులు పాల్గొననున్నారు. పలువురు తెలుగు ప్రముఖులు పృచ్ఛకుల బృందంలో ఉన్నారు. ఇటువంటి తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించిన యునీక్ ప్రోగ్రామ్స్ ఇంకా చాలా ఉన్నాయి.

పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్న నాట్స్ (North America Telugu Society) 8వ అమెరికా తెలుగు సంబరాలకు (NATS Convention) ఆలస్యం చేయకుండా త్వరగా https://sambaralu.org/buynow ని సందర్శించి ఆన్లైన్ లో టికెట్స్ కొనుక్కోవలసిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.

error: NRI2NRI.COM copyright content is protected