Hyderabad, Telangana, March 12: అమెరికా లో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా జరిగే నాట్స్ (NATS) అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ బృందం పలువురు సినీ ప్రముఖులను ఆహ్వానించింది. హైదరాబాద్లో తొలుత దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు (Kovelamudi Raghavendra Rao) ను కలిసి నాట్స్ 8 వ అమెరికా తెలుగు సంబరాల ఆహ్వాన పత్రికను అందించింది.
నాట్స్ సంబరాలకు (NATS Convention) ముఖ్య అతిధిగా రావాలని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ను కోరింది. ఆ తర్వాత వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ (Chalasani Aswini Dutt) ను కలిసి నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రికను అందించింది. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి (Tanikella Bharani) ని కూడా నాట్స్ బృందం కలిసి సంబరాలకు ఆహ్వానించింది.
జూలై 4, 5, 6 తేదీల్లో టాంపా (Tampa, Florida) లో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు రావాలని కోరింది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ను కూడా నాట్స్ బృందం కలిసింది. నాట్స్తో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా థమన్ (Ghantasala Sai Srinivas Sivakumar) కూడా గుర్తు చేసుకున్నారు.
అమెరికా తెలుగు సంబరాలకు థమన్ తప్పనిసరిగా రావాలని నాట్స్ ఆహ్వానించింది. సినీ దర్శకులు హరీశ్ శంకర్ (Sanganabhatla Harish Shankar) మరియు మోహర్ రమేశ్ (Meher Ramesh) లను కూడా కలిసి నాట్స్ ఆహ్వాన పత్రికలు అందించింది. సినీ ప్రముఖుల ఆహ్వానాలు అందించే కార్యక్రమంలో నాట్స్ నాయకులు పలువురు పాల్గొన్నారు.
వీరిలో అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ (Srinivas Guthikonda), నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ సంబరాల కమీటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ సుమిత్ అరికపూడి, నాట్స్ మెంబర్ షిప్ నేషనల్ కోఆర్డినేటర్ ఆర్.కె. బాలినేని, నాట్స్ (NATS) న్యూజెర్సీ చాప్టర్ మాజీ కోఆర్డినేటర్ సురేశ్ బొల్లు తదితరులు పాల్గొన్నారు.