Connect with us

Politics

NRI TDP Connecticut: మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్ర ప్రసాద్ తో ముఖాముఖి

Published

on

అమెరికాలో కనెక్టికట్ రాష్ట్రం లోని హార్ట్ ఫోర్డ్ నగరంలో అక్టోబర్ 24న జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనమండలి సభ్యులు వైవిబి రాజేంద్ర ప్రసాద్ (Yalamanchili Venkata Babu Rajendra Prasad) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ము ఖ్యమంత్రి అయ్యేవిధంగా NRI టిడిపి నాయకులు కృషి చేయాలి అన్నారు.

వైవిబి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి గా చంద్రబాబు (Nara Chandrababu Naidu) ఎంతో అభివృద్ధి చేస్తే మూడున్నర సంవత్సరాల వైసీపీ (YSR Congress Party) పాలనలో దారుణ పరిస్థితులు ఉన్నాయని అన్నారు. కొత్త కంపెనీలు రాక పోగాఉన్న కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలి పోయాయన్నారు.

జగన్ (YS Jaganmohan Reddy) అసమర్థ పాలన వలన అన్ని వర్గాల ప్రజల జీవనం అతలాకుతలమైంది అనీ ప్రజలు పక్క రాష్ట్రాలకు వలస పోయే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకుని జగన్ పరిలన చేస్తున్నారని అన్నారు. వైసీపీ పాలనలో కుక్కలు చింపిన విస్తరిలా అయిన రాష్ట్రాన్ని బాగు చెయ్యాలంటే ఒక్క చంద్ర బాబు గారికే సాధ్యమని అన్నారు.

రాబోయే 2024 ఎన్నికల్లో NRI TDP Connecticut నాయకులు ఏపీ లోని తమ తమ గ్రామాలకు వచ్చి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉండడం వలన జరిగే అభివృద్ధి సంక్షేమాన్ని వివరించి పార్టీ గెలుపు కి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు NRI టిడిపి నాయకులు ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో NRI టిడిపి నాయకులు తరణి పరుచూరి, అశ్విన్ అట్లూరి, ఎండురి శ్రీనివాస్, రావుల శ్రీనాథ్, సుధాకర్ తురగా, యోగేష్ అబ్బూరి, ప్రదీప్ గడ్డం, తేజా రావెళ్ళ, ప్రదీప్ రావెళ్ళ, రాజశేఖర్ శాఖమూరి, దిలీప్ చిలకపతి, జాస్తి శ్రీకాంత్, రామారావు కాజ, పర్చూరి చక్రధర్, పాలడుగు భాస్కర్, నడిపినేని శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected