Connect with us

Cultural

ఆంధ్ర కళా వేదిక: ఖతార్ లో వైభవోపేతంగా సంక్రాంతి సంబరాలు

Published

on

సంక్రాంతి పండుగ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త పంట కోత సందర్భంలో చేసుకునే పెద్ద పండుగ. ఖతార్ దేశం లోని ఆంధ్ర కళా వేదిక ఆధ్వర్యంలో, వెంకప్ప భాగవతుల అధ్యక్షతన అత్యంత వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.

తెలుగు నేపథ్య గాయకులు శ్రీ ప్రవీణ్ కుమార్ కొప్పోలుకు తోడుగా శ్రీమతి సత్యభామ స్వాతి, ప్రముఖ జానపద గాయకురాలు శ్రీమతి శిరీష, అత్యంత ప్రజాదరణ పొందిన డాన్స్ షో “ఢీ (DHEE)” ఫేమ్ డాన్స్ మాస్టర్ పండు మరియు మాధురి లు తమ పాటలతో, ఆటలతో మరియు మాటలతో ప్రేక్షకులను ఆద్యంతం ఓలలాడించి ఉర్రూతలూగించారు.

ముఖ్య అతిధిగా ఖతార్ లోని భారత రాయబార కార్యాలయం నుండి విచ్చేసిన మొదటి కార్యదర్శి (సాంస్కృతిక, విద్య & సమాచారం) శ్రీ సచిన్ దినకర్ శంక్పాల్ మాట్లాడుతూ బాషా, కళా, సాంస్కృతిక మరియు సేవా రంగాలలో చేస్తున్న కృషికి ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

శ్రీ వినోద్ నాయర్ – A/ ప్రెసిడెంట్, ఇండియన్ కమ్యూనిటీ బెనివలెంట్ ఫోరమ్ (ICBF), శ్రీ కృష్ణ కుమార్ -ప్రధాన కార్యదర్శి, ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC), (ICBF)మెడికల్ అసిస్టెన్స్ హెడ్ శ్రీమతి రజని మూర్తి, AKV సలహామండలి చైర్మన్ శ్రీ సత్యనారాయణ, తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గద్దె, శ్రీ హరీష్ రెడ్డి ఇతర ప్రముఖులు మరియు తెలుగు సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఆనందించి వారి అభినందనలు తెలియజేసారు.

ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు శ్రీ వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ కార్యక్రమానికి సుమారు 1000 మందికి పైగా హాజరయ్యారని, సమయాభావాన్ని కూడా లెక్కచెయ్యకుండా ప్రేక్షకులు కార్యక్రమాన్ని పూర్తిగా ఆస్వాదించారు అని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ విజయవంతంగా నిర్వహించుకోటానికి సహకరించిన ప్రాయోజితుల (స్పాన్సర్స్) కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమం కోసం తమ కార్యవర్గ సభ్యులు శ్రీ గొట్టిపాటి రమణ గారు, విక్రమ్ సుఖవాసి, వీబీకే మూర్తి, శ్రీ సుధ, సోమరాజు, రవీంద్ర, శేఖరం రావు, సాయి రమేష్, KT రావు, శిరీష రామ్ బృందం చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమానికి కుమారి ఖ్యాతి మరియు కుమారి అనన్యలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా శ్రీమతి చూడామణి మరియు శ్రీమతి శ్రీ సుధ గారు వారి వెన్నుండి సహకరించారు.

ఈ కార్యక్రమానికి సహకరించిన స్వచ్ఛంద సేవకులు (వాలంటీర్స్) కి ప్రత్యేకించి రమేష్ మరియు మెసయిద్ టీంకి, వేదిక ప్రాంగణ అలంకరణకు సహకరించిన మహిళలందరికీ మరియు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న చిన్నారులను, వారి తల్లితండ్రులకు కూడా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, వేదిక ప్రాంగణం అలంకరణ, బొమ్మల కొలువు, గొబ్బిళ్ళు, ముగ్గులు, చిన్నారుల నాట్యాలు, రుచికరమైన సాంప్రదాయ తెలుగింటి భోజనం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆంధ్ర కళావేదిక ప్రధాన కార్యదర్శి శ్రీ విక్రమ్ సుఖవాసి ముగింపు సందేశ ధన్యవాదాలు తో కార్యక్రమం వైభవోపేతంగా ముగిసింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected